పొగాకు వ్యాపారుల పోటాపోటీ
అంతర్జాతీయ మార్కెట్లో వ్యాపారులకు పొగాకు ఎగుమతి అనుమతులు ఖరారయ్యాయి. దీంతో గత వారం రోజులుగా అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లో వ్యాపారులు పోటీ పడుతున్నారు.
పెరుగుతున్న ధరలు
ఒంగోలు-2 కేంద్రంలో పొగాకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: అంతర్జాతీయ మార్కెట్లో వ్యాపారులకు పొగాకు ఎగుమతి అనుమతులు ఖరారయ్యాయి. దీంతో గత వారం రోజులుగా అన్ని రకాల గ్రేడ్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లో వ్యాపారులు పోటీ పడుతున్నారు. తద్వారా మేలిమి నుంచి లో గ్రేడ్ రకం పొగాకు ధర వరకూ రెక్కలొచ్చాయి. జిల్లాలోని కేంద్రాల్లో శుక్రవారం జరిగిన వేలంలో ఒంగోలు-2 కేంద్రంలో అత్యధికంగా రూ.229 చొప్పున లభించింది. ఒంగోలు-1, కొండపి, పొదిలిలో రూ.228; టంగుటూరు-1లో రూ.227; వెల్లంపల్లిలో రూ.226, కనిగిరిలో రూ.224 చొప్పున అత్యధిక ధరలు లభించాయి. ఈ ఏడాది నెలకొన్న గిరాకీ కారణంగా ఎఫ్-4, ఎఫ్-5 రకాలకు కూడా మేలిమితో సమానంగా ధర పలుకుతోంది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలో 4,077 బేళ్లురాగా, అందులో 3,833 బేళ్లు; ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 2,520 బేళ్లు రాగా, అందులో 2,270 బేళ్లను కొనుగోలు చేశారు. కొండపి కేంద్రంలో కనిష్ఠ ధర రూ.150 చొప్పున లభించింది. ప్రముఖ సంస్థ కొనుగోళ్లను వేగం చేయడంతో ధరలు పెరుగుతున్నాయి. వ్యాపారుల పోటీ కారణంగా ధర మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కర్ణాటక మార్కెట్తో సమానంగా ధర లభిస్తున్న నేపథ్యంలో రానున్న సీజన్లో సాగు మరింత పెరగనుంది. పొదిలి కేంద్రంలో శుక్రవారం జరిగిన కొనుగోళ్లను బోర్డు ఆర్.ఎం.లక్ష్మణరావు పరిశీలించారు.
పొదిలి, న్యూస్టుడే : పొదిలి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం పొగాకు కిలో గరిష్ఠధర రూ.228 పలికింది. ఒంగోలు వేలం కేంద్రంలో గరిష్ఠధర కిలో రూ.229 పలకగా పొదిలిలో రూ.228 ధర పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి గ్రేడ్లతో సంబంధం లేకుండా వ్యాపారులు ధర చెల్లిస్తుండటం రైతులకు కలిసొస్తోంది. ఈ సీజన్లో గరిష్ఠధర రూ.245 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 842 బేళ్లను వేలానికి తీసుకురాగా 789 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. గరిష్ఠధర కిలో రూ.228, కనిష్ఠ ధర రూ.156, సరాసరి ధర రూ.220 పలికింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?