మస్టర్లు మీకు.. ఓట్లు మాకు
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రలోభాలపర్వంగా మార్చేందుకు వైకాపా నాయకులు కొందరు తహతహలాడుతున్నారు. తాజాగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అందుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
ఎన్నికల వేళ రాజకీయ ఉపాధి
కూలీలతో నాయకుల బేరసారాలు
పెద్దారవీడు, న్యూస్టుడే: అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రలోభాలపర్వంగా మార్చేందుకు వైకాపా నాయకులు కొందరు తహతహలాడుతున్నారు. తాజాగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అందుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కూలీలు ఎర్రని ఎండలో కష్టపడి పనులు చేస్తే వారానికి రూ.400 బిల్లులు మంజూరు చేయడమే ఇప్పటి వరకు గగనం. సార్వత్రిక ఎన్నికలు తరుముకు రావడంతో ఇప్పుడు ఉదార స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు. పనికి రాకున్నప్పటికీ మస్టర్లు వేసి కూలిస్తామని చెబుతున్నారు. ఓటు మాత్రం తమ అభ్యర్థికేనంటూ బేరసారాలకు దిగుతున్నారు. పెద్దారవీడు మండలంలోని పంచాయతీల్లో ఈ తరహా ధోరణి ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది.
ప్రలోభాలకు తెర లేపారు...: అక్రమాలకు పాల్పడటంతో గతంలో పనిచేసిన ఏపీవో సస్పెండ్కు గురయ్యారు. ఏడాది నుంచి ఈసీగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇదే అదునుగా కొందరు రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. కూలీలు పనికి రాకున్నా క్షేత్రసహాయకులతో మస్టర్లు వేయిస్తామని, ప్రతిఫలంగా ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత తమకు కొంత ముట్టజెప్పేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో క్షేత్ర సహాయకులు చాలా వరకు అధికార పార్టీకి చెందినవారే. ఇదే అదునుగా ఉచిత మస్టర్లను ఓట్లుగా మలచుకునేందుకు మండల స్థాయి అధికార పార్టీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. పనికి వెళ్లకపోయినా వంద రోజులకు మస్టర్లు వేస్తామని, తమకు అనుకూలంగా ఉండాలంటూ కూలీలను కోరుతున్నారు.
పర్యవేక్షణ మరిచిన అధికారులు...: నిబంధనల ప్రకారం పని ప్రదేశాలకు టెక్నికల్్ అసిస్టెంట్లు ప్రతి రోజూ వెళ్లి తనిఖీలు చేసి కొలతలు తీసుకుని మస్టర్లు వేయాలి. కానీ ఇక్కడ టెక్నికల్ అసిసెంట్లు కేవలం బుధవారం, శనివారం కార్యాలయానికి వస్తున్నారు. మండల స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో పనుల్లో అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ఈ విషయమై ఇన్ఛార్జి ఏపీవో మంత్రునాయక్ మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదని.. ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రసహాయకులుగా కుటుంబ సభ్యుల పేరు ఉండి, మరొకరితో పనులు చేయిస్తున్న వారిని, రాజకీయ సభలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని గుర్తించి తొలగించినట్లు తెలిపారు.
పనులు చేస్తున్న ఉపాధి కూలీలు(పాత చిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం
[ 30-04-2024]
మీ బిడ్డనంటూ జగన్ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. -
అబద్ధాల అన్నొస్తున్నాహో!
[ 30-04-2024]
జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. -
‘మహిళా భేరి’ మోగిద్దాం.. అరాచక పాలన తరుముదాం
[ 30-04-2024]
‘పాలకులను నిర్ణయించేది మహిళలే.. వారి చేతుల్లోనే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అభివృద్ధికి ఓటేసి.. అరాచకాన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తెదేపా కొండపి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. -
హవ్వ.. భావి పౌరుల భుజాలపై జెండాలా!
[ 30-04-2024]
అధికార వైకాపా నేతల తీరుతో భావి భారత పౌరులు పార్టీ కార్యకర్తల్లా జెండాలు మోస్తూ అవస్థలకు గురయ్యారు. విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నిర్వాహకులు ఇష్టారీతిగా వాడుకోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మానవత్వం మరణించింది !
[ 30-04-2024]
వందలాది మంది సాక్షిగా మానవత్వం మరణించింది. రక్తమోడుతున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి
[ 30-04-2024]
గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
సార్వత్రిక రణం.. హోరెత్తనున్న ప్రచార పర్వం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలై ఈ నెల 25 వరకు కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 32 మంది 61 సెట్లు దాఖలు చేశారు. -
ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 30-04-2024]
రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
తనిఖీల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు
[ 30-04-2024]
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల ప్రత్యేక సాధారణ పరిశీలకుడు శ్రీరామ్ మోహన్ మిశ్రా సూచించారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు
[ 30-04-2024]
చెల్లని చెక్కు కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. సీఎస్పురం మండలం అరివేముల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి పరమేశ్వరరెడ్డి వెలిగండ్ల మండలం
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!