నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
మాట్లాడుతున్న ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, చిత్రంలో జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ఆసాంతం నియమావళిని తప్పకుండా పాటించాలని సూచించారు. పారదర్శకత, నిష్పాక్షికతతో విధులు నిర్వహించాలని అన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కును ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అక్రమ మద్యం, నగదు రవాణా, పంపిణినీ సమర్థంగా అడ్డుకోవాలని చెప్పారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ప్రచారానికి వచ్చే ముఖ్య నాయకులకు భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ గురించి సమగ్ర సమాచారం సేకరించి తదనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీసు అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించాలని అన్నారు. జిల్లా ఎన్నికల ప్రణాళిక ప్రకారం బందోబస్తు చేపట్టి కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని అన్నారు. పోలీసు స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విజిబుల్ పోలీసింగ్ను పెంచాలని, నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలనీ, నేరచరిత్ర కలిగిన వారిని బైండోవర్ చేయాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలపై ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఐజీకి వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎస్.వి.శ్రీధర్రావు, అశోక్బాబు, డీఎస్పీలు కిషోర్బాబు, రామరాజు, అశోక్వర్థన్, సి.హెచ్.శ్రీనివాసరావు, ట్రైనీ డీఎస్పీ షహనాజ్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, జిల్లాలోని సీఐలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బానిస పోలీసులపై వేటు
[ 01-05-2024]
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. -
భరోసాల తెదేపా... ప్రలోభాల వైకాపా
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. -
దుకాణాల మూత.. అక్రమంగా చేరవేత
[ 01-05-2024]
ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది. -
మీకంటే రౌడీషీటర్లు నయం
[ 01-05-2024]
‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు. -
ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి
[ 01-05-2024]
శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్ సెంటర్..గెలాక్సీపురిలో గ్రానైట్ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి. -
ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత
[ 01-05-2024]
అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. -
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ పన్నాగాలు
[ 01-05-2024]
ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. -
రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు
[ 01-05-2024]
‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. -
నిలువునా ఎండిన ఉద్యాన తోటలు
[ 01-05-2024]
చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!