వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు.
రాజీనామాలు చేయాలంటూ ఒత్తిళ్లు
పట్టించుకోని అధికార యంత్రాంగం
ఈనాడు, ఒంగోలు
కనిగిరిలో రాజీనామా పత్రాలతో వాలంటీర్లు
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. వార్డు వాలంటీర్ సుజన ప్రియ ప్రచారంలో పాల్గొనడాన్ని గుర్తించి ఆమె అడిగారు. ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. జెండా కర్రలతో ప్రభావతి కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మూడు రోజులపాటు ఒంగోలు నగరాన్ని రణరంగంగా మార్చింది. ఇదిలా ఉంటే వివాదానికి కారణమైన సదరు వాలంటీర్ ఈ నెల 6న రాజీనామా చేశారని, 7న ఆమోదించామని అధికారులు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆ రోజు ప్రచారంలో వాలంటీర్ లేకుంటే వివాదానికే తావు లేదు.
ముందస్తు చెల్లింపులు...: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసే పేరుతో 50 ఇళ్లకు ఒకరిని నియమించినట్లు గొప్పలు చెప్పుకొని.. ఇప్పుడు వారితో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నానాపాట్లు పడుతున్నారు. వాలంటీర్లతో ఓటర్ల పూర్తి సమాచారాన్ని వైకాపా ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. సంక్షేమ పథకాల సాకు చూపుతూ తమకు ఓట్లు వేయించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం తీసుకుంటున్న ఉద్యోగులెవరూ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనకూడదన్న ఈసీ ఉత్తర్వులతో వారి కుతంత్రాలకు తెర పడింది. దీంతో మరో కొత్త నాటకానికి ఇప్పుడు తెర లేపారు. వాలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నారు. గెలిచాక మీకే ఉద్యోగాలంటూ మాయమాటలు చెబుతున్నారు. తమకు అనుకూలంగా పనిచేసేందుకు గాను ముందస్తుగా రూ. వేలల్లో నగదు చెల్లిస్తున్నారు. ప్రచారంలో పాల్గొనడాన్ని స్థానికులు ఎవరైనా నిలదీస్తే రాజీనామాలు చేశామంటూ తెలుపుతున్నారు. అధికారులు కూడా వైకాపా ప్రజాప్రతినిధులకు వంత పాడుతూ వివాదం తలెత్తిన ఒకటీ రెండు రోజులకు ముందుకు రాజీనామాలను ఆమోదించినట్లు తాపీగా సెలవిస్తున్నారు.
ఎదురు తిరుగుతున్నారు...: జిల్లాలో మొత్తం 719 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 6,797 మంది విధులు నిర్వహిస్తున్నారు. యాభై ఇళ్లకు ఒకరు చొప్పున దాదాపు 11,500 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రజాధనాన్ని వేతనంగా పొందుతున్న వీరిలో ఎక్కువమంది వైకాపా కార్యకర్తలు, అభ్యర్థుల తరఫున ప్రచార కార్యకర్తల అవతారమెత్తారు. కొందరు నేతలు వీరిని భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి సొంత పార్టీ కార్యకర్తలుగా వినియోగించుకుంటున్నారు. అభ్యర్థులు, ఓటర్లకు మధ్య ప్రలోభాలకు గురిచేసే వారధులుగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 42 మంది కోడ్ ఉల్లంఘించి అధికారుల వేటుకు గురయ్యారు. మరికొందరు తమకు ఉద్యోగం అవసరమని, ఒత్తిళ్లు తేవొద్దని నేతలకు చెబుతూ రాజీనామాలకు ససేమిరా అంటూ ఎదురుతిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వివాదాలకు తావు లేకుండా ఎన్నికల నిబంధనలు సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బానిస పోలీసులపై వేటు
[ 01-05-2024]
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. -
భరోసాల తెదేపా... ప్రలోభాల వైకాపా
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. -
దుకాణాల మూత.. అక్రమంగా చేరవేత
[ 01-05-2024]
ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది. -
మీకంటే రౌడీషీటర్లు నయం
[ 01-05-2024]
‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు. -
ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి
[ 01-05-2024]
శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్ సెంటర్..గెలాక్సీపురిలో గ్రానైట్ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి. -
ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత
[ 01-05-2024]
అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. -
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ పన్నాగాలు
[ 01-05-2024]
ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. -
రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు
[ 01-05-2024]
‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. -
నిలువునా ఎండిన ఉద్యాన తోటలు
[ 01-05-2024]
చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత