అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు.
నామినేషన్ల ప్రక్రియ మొదలు|
తొలిరోజు 13 మంది దాఖలు
ఒంగోలు కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద పోలీసు పహారా
ఈనాడు, ఒంగోలు: పామూరు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. ఎన్నికల క్రతువులో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్(ప్రమాణ పత్రం) అత్యంత కీలకం. తమ వివరాలతో పాటు ఆస్తులు, అప్పుల గురించి అందులో ముందే స్పష్టం చేయాలి. గతంలో ఏమైనా కేసులున్నా, శిక్ష పడినా తెలపాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కలిపి దాఖలు చేసే పత్రమే అఫిడవిట్. అందులో తప్పుడు సమాచారం పొందు పరిస్తే అదే ప్రత్యర్థులకు ఆయుధమవుతుంది. వివాదం కోర్టు కేసుల వరకు వెళ్లడమే కాకుండా ఏకంగా అనర్హత వేటుకు దారి తీసే ప్రమాదముంది. దాఖలు సమయంలోనే అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సి ఉంటుంది. పొరపాట్లు చేస్తే తిరస్కరణకు గురికాక తప్పదు. గతంలో ఇలాంటి పొరపాటుతో కనిగిరి నియోజకవర్గంలో కదిరి బాబూరావు నామపత్రం చెల్లకుండా పోయింది.
లెక్క.. ఉండాల్సిందే పక్కా...
స్థిర, చరాస్తుల వివరాలతో పాటు చేతిలో, బ్యాంకు ఖాతాల్లోని నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్, బీమా పాలసీలు, అప్పులు వంటి వివరాలను నామపత్రంలో పొందుపరచాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య స్థలాలు, నివాస స్థలాల వంటి వాటినీ ప్రస్తావించాలి. అవన్నీ వారసత్వంగా సంక్రమించాయా.. కొనుగోలు చేశారా అనేది తెలపాలి. స్థిరాస్తులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువను వివరించాలి. అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలుంటే వాటి వివరాలూ తెలపాలి. కుటుంబ సభ్యుల ఆదాయ మార్గాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీల కాంట్రాక్టులున్నా బయట పెట్టాలి. క్రిమినల్ కేసులు, ఏదైనా కేసులో న్యాయ స్థానాలు శిక్ష విధించినా, అప్పీల్కు వెళ్లినా సదరు సమాచారం ఇవ్వాలి. సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలపాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్కు నోటరీ తప్పనిసరి.
అన్నీ పూరించాల్సిందే...
అఫిడవిట్లోని ఏ ఒక్క కాలమ్ ఖాళీగా వదలరాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గుర్తింపు పొందని పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రంలో ఈసీఐ సూచించిన ఫ్రీ సింబల్స్ నుంచి తమకు కేటాయించాల్సిన గుర్తులు మూడింటిని ప్రాధాన్యక్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి వివరాలతో సమర్పించకుంటే పరిశీలన(స్క్రూటినీ) సమయంలో తిరస్కరణకు గురవుతుంది. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అప్పుడే అభ్యర్థులపై ఓ స్పష్టత వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను ఆర్వోలు నోటీసు బోర్డు, వెబ్సైట్లో పొందుపరుస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బానిస పోలీసులపై వేటు
[ 01-05-2024]
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. -
భరోసాల తెదేపా... ప్రలోభాల వైకాపా
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. -
దుకాణాల మూత.. అక్రమంగా చేరవేత
[ 01-05-2024]
ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది. -
మీకంటే రౌడీషీటర్లు నయం
[ 01-05-2024]
‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు. -
ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి
[ 01-05-2024]
శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్ సెంటర్..గెలాక్సీపురిలో గ్రానైట్ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి. -
ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత
[ 01-05-2024]
అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. -
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ పన్నాగాలు
[ 01-05-2024]
ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. -
రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు
[ 01-05-2024]
‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. -
నిలువునా ఎండిన ఉద్యాన తోటలు
[ 01-05-2024]
చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్