logo

వైభవం.. రాములోరి రథోత్సవం

శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి.

Published : 20 Apr 2024 03:00 IST

శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. గత మూడు రోజుల పాటు రామాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టాభి రామస్వామి మూలవిరాట్‌, ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, కల్యాణం నిర్వహించారు. భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముగింపు సందర్భంగా రాత్రి వేళ స్వామి వారి రథోత్సవం వైభవంగా సాగింది.

న్యూస్‌టుడే, మార్కాపురం గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని