logo

200 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

బాగెమ్మపేటలో విజిలెన్స్‌ అధికారులు దాడిచేసి అక్రమంగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. గురువారం రాత్రి విజిలెన్స్‌ ఎస్‌ఐ బి.రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది....

Published : 29 Jan 2022 05:24 IST

వంగర, న్యూస్‌టుడే: బాగెమ్మపేటలో విజిలెన్స్‌ అధికారులు దాడిచేసి అక్రమంగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. గురువారం రాత్రి విజిలెన్స్‌ ఎస్‌ఐ బి.రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి వడ్డి సూర్యనారాయణ, పి.కృష్ణారావు, శంకరరావు, ఉమామహేశ్వరరావు వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 6(ఎ) కేసులు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని రేగిడి పౌరసరఫరాల గోదాంకు తరలించినట్లు వంగర తహసీల్దార్‌ ఐజాక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని