logo

నేడు వంశధార నిర్వాసితుల సమస్యలపై భాజపా ధర్నా

వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం హిరమండలంలో ధర్నా చేయనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బోయన ధర్మారావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ మేరకు తహసీల్దారు సత్యనారాయణను

Published : 24 May 2022 06:21 IST

హిరమండలం, న్యూస్‌టుడే: వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం హిరమండలంలో ధర్నా చేయనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బోయన ధర్మారావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ మేరకు తహసీల్దారు సత్యనారాయణను కలిసి సమాచారం అందజేసినట్లు చెప్పారు. ఏబీ రహదారి మీదుగా ఉదయం 10 గంటలకు నిర్వాసితులతో ర్యాలీగా వెళ్లి తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవి, కార్యవర్గ సభ్యులు హాజరవుతారన్నారు. నిర్వాసితులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని