logo

మిస్టర్‌ ఆంధ్రా ఛాంపియన్‌ అజయ్‌ యాదవ్‌

మిస్టర్‌ ఆంధ్రాగా విశాఖకు చెందిన బి.అజయ్‌ యాదవ్‌ ఎంపికయ్యారు. ఇచ్ఛాపురం పుర బాలికోన్నత పాఠశాలలో జరిగిన శరీర సౌష్ఠవ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 159 మంది క్రీడాకారులు పాల్గొన్నారు

Published : 29 Nov 2022 06:07 IST

ఆకట్టుకున్న వివిధ జిల్లాల క్రీడాకారుల ప్రదర్శన

మిస్టర్‌ ఆంధ్రాగా విశాఖకు చెందిన బి.అజయ్‌ యాదవ్‌ ఎంపికయ్యారు. ఇచ్ఛాపురం పుర బాలికోన్నత పాఠశాలలో జరిగిన శరీర సౌష్ఠవ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 159 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేదాకా పోటీలు సాగాయి. విజేతగా నిల్చిన అజయ్‌ యాదవ్‌కు రాష్ట్ర బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.గురునాథరావు ట్రోఫీ రూ.30వేల నగదు అందించారు. మన్యం జిల్లా క్రీడాకారుడు ఎస్‌.కిశోర్‌, కాకినాడ జిల్లా వాసి ఎస్‌.రమేష్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 11 విభాగాల్లో ప్రతిభ చూపినవారికి నిర్వాహకులు ఉలాల శ్యామ్‌, వెంపాడ శ్రీకాంత్‌రెడ్డి, ఇండియన్‌ బాడీ బిల్డర్‌ నందిగాం కోటేశ్వరరావులు పురస్కారాలు అందించారు.

- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని