logo

మీకు అండగా ఉంటా: ఎంపీ

పాత నౌపడాలో రైల్వే స్థలం అంటూ తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు తమ గోడును పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముందు వెళ్లబుచ్చుకున్నారు.

Published : 06 Feb 2023 06:17 IST

ఎంపీ రామ్మోహన్‌నాయుడికి సమస్యలు వివరిస్తున్న బాధితులు

టెక్కలి, న్యూస్‌టుడే: పాత నౌపడాలో రైల్వే స్థలం అంటూ తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు తమ గోడును పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముందు వెళ్లబుచ్చుకున్నారు. ఆదివారం పాత నౌపడాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గతంలో పలుమార్లు ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఎంపీగా ఎర్రన్నాయుడు ఉన్న సమయంలో తమకు న్యాయం జరిగిందని పలువురు వివరించారు. ప్రస్తుతం న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు ఆయనను కోరారు. సమస్యపై పూర్తి అవగాహన ఉందని, మీకు అండగా ఉంటానని, రైల్వే అధికారులతో ఇప్పటికే మాట్లాడానని, మరోసారి మాట్లాడి శాశ్వత పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఎంపీ వారికి చెప్పారు. ఆయనతో పాటు బగాది శేషగిరిరావు, మల్లా బాలకృష్ణ, మామిడి రాము, చిన్నయ్యరెడ్డి, కర్రి విష్ణు, మెండ దాసునాయుడులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని