logo

జాతీయస్థాయి పోటీలకు న్యాయనిర్ణేతగా అజయ్‌కుమార్‌

మహారాష్ట్రలో నేటి నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు ఉప ప్రధాన న్యాయనిర్ణేత(డిప్యూటీ చీఫ్‌ రిఫరీ)గా టెక్కలి మండలం నౌపడ ఆర్‌ఎస్‌ గ్రామానికి చెందిన పి.అజయ్‌కుమార్‌ నియమితులయ్యారు.

Published : 30 Mar 2023 03:33 IST

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: మహారాష్ట్రలో నేటి నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు ఉప ప్రధాన న్యాయనిర్ణేత(డిప్యూటీ చీఫ్‌ రిఫరీ)గా టెక్కలి మండలం నౌపడ ఆర్‌ఎస్‌ గ్రామానికి చెందిన పి.అజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బాల్‌బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినట్లు బాల్‌బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి పి.వి.జి.కృష్ణంరాజు తెలిపారు. అజయ్‌కుమార్‌ ప్రస్తుతం రాజాం మండలం పొగిరి జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామోపాధ్యాయుడిగా పని చేస్తున్నారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని