అయిదేళ్లుగా ఆటంకమే!
వైకాపా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత క్రీడల సంగతి గాలికొదిలేసింది. అయిదేళ్లలో మైదానాల అభివృద్ధికి రూపాయి కూడా మంజూరు చేయలేదు.
అభివృద్ధికి నోచుకోని పాత్రునివలస క్రీడా మైదానం
న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్
వైకాపా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత క్రీడల సంగతి గాలికొదిలేసింది. అయిదేళ్లలో మైదానాల అభివృద్ధికి రూపాయి కూడా మంజూరు చేయలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. శ్రీకాకుళం నగర పరిధిలోని పాత్రునివలసలో బహుళ క్రీడా సముదాయమే అందుకు నిదర్శనం.
తెదేపా హయాంలో నియోజకవర్గానికి ఒక క్రీడామైదానం మంజూరు చేశారు. అందులో భాగంగా పాత్రునివలసలో సుమారు 33.33 ఎకరాల విస్తీర్ణంలో మైదానం పనులు చేపట్టారు. రూ.1.5 కోట్లతో రక్షణ గోడ ఏర్పాటు చేశారు. మరో రూ.6 కోట్లతో బహుళ క్రీడా సముదాయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పునాదులు పూర్తి చేసిన తరువాత ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి.
బిల్లుల చెల్లింపులో జాప్యం..
పాత్రునివలస క్రీడాసముదాయం నిర్మాణానికి తెదేపా రెండు దశల్లో నిధులు మంజూరు చేసింది. రక్షణ గోడ నిర్మాణానికి రూ.1.5 కోట్లు కేటాయించగా.. అందులో రూ.1.06 కోట్లు మాత్రమే గుత్తేదారుకు చెల్లించారు. మిగిలిన రూ.44 లక్షలు పెండింగ్లో పెట్టారు. ఇండోర్ మైదానం పనుల్లో సైతం కేవలం రూ.83 లక్షలు ఇచ్చారు. మరో రూ.35 లక్షలు రావాల్సి ఉండటంతో పాటు మిగిలిన పనులకు బిల్లులే అప్లోడ్ చేయలేదు. బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం కారణంగా గుత్తేదారు పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం, పాలకులు సైతం వాటిపై దృష్టి సారించకపోవడంతో అయిదేళ్ల పాటు మైదానం పనులు పడకేశాయి.
సొంత నిధులతో కొన్ని పనులు..
ఆమదాలవలస కేవీకే మైదానాన్ని కొన్నేళ్ల కిందట ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అప్పగించడంతో అక్కడ పని చేసిన సీనియర్ అథ్లెటిక్ శిక్షకుడు డా.కళ్లేపల్లి శ్రీధర్రావును పాత్రునివలస మైదానానికి బదిలీ చేశారు. ఆ సమయంలో కనీస వసతుల్లేని మైదానం అభివృద్ద్ధి చేసేందుకు శ్రీధర్రావు ముందడుగు వేశారు. సుమారు రూ.2 లక్షల సొంత నిధులతో క్రీడాకారుల అవసరాలకు ఓ గది నిర్మించారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు బిల్లులు అప్లోడ్ చేయలేదు. హాకీ శిక్షకుడు అనిల్కుమార్ సహాకారంతో హాకీ, హ్యాండ్బాల్, రన్నిôగ్ ట్రాక్లను అభివృద్ధి చేశారు. ఈ విషయమై డీఎస్డీవో మాట్లాడుతూ ప్రస్తుతం పాత్రునివలసలో హ్యాండ్బాల్, హాకీ శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఖేలో ఇండియా క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపామని, అనుమతులు వచ్చాక పనులు చేస్తాం’ అని స్పష్టం చేశారు.
ప్రతిపాదనలకే పరిమితం..
గతేడాది ఖేలో ఇండియా క్రీడా మైదానాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ సమయంలో పాత్రునివలస మైదానం పనులకు ప్రతిపాదనలు పంపారు. 50 మీ. ఈత కొలను, హాకీ మైదానం, 500మీ. సింథటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు మంజూరు చేస్తుంది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో ఇప్పటి వరకు శాప్ నుంచి డీఎస్ఏకు ఎలాంటి సమాచారం అందలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
[ 28-04-2024]
పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. -
అన్నొచ్చాడు.. అడ్డంగా బాదేశాడు..!
[ 28-04-2024]
‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు. -
మీరేం అభివృద్ధి చేశారు..?
[ 28-04-2024]
సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. -
ఉప్పుగెడ్డపై వంతెన.. ఉత్తమాటేనా?
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. -
మాకొద్దీ వైకాపా..!
[ 28-04-2024]
జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ మంచివారు.. సౌమ్యులు.. బాగా పనిచేస్తారు.. అంటూ కితాబిచ్చినా, మెచ్చుకున్నా ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం వారిపట్ల విశ్వసనీయత కనిపించడం లేదు.. -
తెదేపాలోకి జోరుగా చేరికలు
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో తేదేపాలో చేరాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 28-04-2024]
జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూచించారు. -
సామూహిక నిర్లక్ష్యం
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. -
కన్నీటి శోకం..
[ 28-04-2024]
గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి. -
ఛార్జీల పోటు.. అదే జగనన్న రూటు
[ 28-04-2024]
ఛార్జీల పేరిట జగనన్న ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీల పెరుగుదల ఇలా ఏది తీసుకున్నా.. ప్రజలకు షాక్ తప్పడం లేదు. విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ అంతే. -
తెదేపాతోనే అభివృద్ధి
[ 28-04-2024]
ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెదేపా నాయకులు ప్రజలకు సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందన్నారు. అభివృద్ధి పరుగులు తీస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్