ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు.
సువిధ వెబ్సైట్
న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారాలకు అనుమతి తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు. అనుమతుల్లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టినా, సభలు, సమావేశాలు నిర్వహించినా.. మైక్ సెట్ల వినియోగంతో పాటు కరపత్రాలు పంపిణీ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ అనుమతులు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సువిధ’ పేరిట ప్రత్యేక వెబ్సైట్, యాప్ను రూపొందించింది. దీని ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
ఇంటి నుంచే దరఖాస్తులు..
గతంలో రాజకీయ నాయకుల ప్రచారం, ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు తీసుకోకపోయినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిబంధనలు కఠిన తరం చేసి అనుమతులు అనివార్యం చేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ నాయకులు తమకు నచ్చిన విధంగా చేస్తామంటే కుదరదు. తప్పనిసరిగా అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందే. వాటి కోసం గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఇంటి నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. అభ్యర్థులు ఆన్లైన్లోనే అన్ని రకాల ధ్రువపత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో సంబంధిత రిటర్నింగ్ అధికారి అనుమతులు జారీ చేస్తారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ స్పష్టం చేశారు. బుధవారం జేసీ నవీన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఇప్పటికే ప్రచారాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముందస్తుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రచారం నిర్వహించినా, భారీ ప్రదర్శనలు చేపట్టినా, ట్రాఫిక్కు అంతరాయం కలిగించినా పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఈ విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకుని నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
దరఖాస్తు ఇలా..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, రాజకీయ పార్టీలు అనుమతుల కోసం suvidha.eci.gov.in వెబ్సైట్లో నిర్దేశిత వివరాలు పొందుపరచాలి. దరఖాస్తుదారుడు లేదా అభ్యర్థి తన ఫోన్ నంబరుతో లాగిన్ అవ్వాలి. ఒకసారి లాగిన్ అయ్యాక పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. ర్యాలీలు, జెండాలు, హోర్డింగ్లు, వాహనాలు, సభలు, సమావేశాలు, ప్లెక్సీల ఏర్పాటు, ఇంటింటి ప్రచారం, మైక్ల వినియోగం, కరపత్రాల పంపిణీ ఇలా 24 అంశాలకు సంబంధించి అనుమతులు తీసుకోవచ్చు. ఆయా అంశాలవారీగా అభ్యర్థికి కావాల్సిన అనుమతికి సంబంధించి కొన్ని పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వాటిని రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉంటే ఆన్లైన్లోనే అనుమతులు జారీ చేస్తారు. సరైన పత్రాలు సమర్పించకుంటే తిరస్కరిస్తారు. ఇదే కాకుండా అభ్యర్థులు సంబంధిత రిటర్నింగ్ అధికారికి నేరుగా కూడా దరఖాస్తు చేసుకుని 24 గంటల్లో అనుమతి పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
[ 28-04-2024]
పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. -
అన్నొచ్చాడు.. అడ్డంగా బాదేశాడు..!
[ 28-04-2024]
‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు. -
మీరేం అభివృద్ధి చేశారు..?
[ 28-04-2024]
సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. -
ఉప్పుగెడ్డపై వంతెన.. ఉత్తమాటేనా?
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. -
మాకొద్దీ వైకాపా..!
[ 28-04-2024]
జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ మంచివారు.. సౌమ్యులు.. బాగా పనిచేస్తారు.. అంటూ కితాబిచ్చినా, మెచ్చుకున్నా ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం వారిపట్ల విశ్వసనీయత కనిపించడం లేదు.. -
తెదేపాలోకి జోరుగా చేరికలు
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో తేదేపాలో చేరాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 28-04-2024]
జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూచించారు. -
సామూహిక నిర్లక్ష్యం
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. -
కన్నీటి శోకం..
[ 28-04-2024]
గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి. -
ఛార్జీల పోటు.. అదే జగనన్న రూటు
[ 28-04-2024]
ఛార్జీల పేరిట జగనన్న ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీల పెరుగుదల ఇలా ఏది తీసుకున్నా.. ప్రజలకు షాక్ తప్పడం లేదు. విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ అంతే. -
తెదేపాతోనే అభివృద్ధి
[ 28-04-2024]
ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెదేపా నాయకులు ప్రజలకు సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందన్నారు. అభివృద్ధి పరుగులు తీస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం