logo

యువకుడి హత్యకేసులో ముగ్గురిఅరెస్టు

నడిరోడ్డుపై యువకుడిని దారుణంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను గాజువాక పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ఇవి. ఆదివారం రాత్రి గోపాలరెడ్డినగర్‌లో నడిచి వెళ్తున్న 

Published : 25 Jan 2022 04:50 IST

అరెస్టు చేసిన నిందితులు

గాజువాక, న్యూస్‌టుడే: నడిరోడ్డుపై యువకుడిని దారుణంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను గాజువాక పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ఇవి. ఆదివారం రాత్రి గోపాలరెడ్డినగర్‌లో నడిచి వెళ్తున్న  ప్రసాద్‌(32)ను ఇదే కాలనీకి చెందిన దగ్గర బంధువులైన  శ్రీను(34), సింహాచలం(32), దుర్గాప్రసాద్‌(21) చీకట్లో మాటువేసి ఇనుపరాడ్డు, కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపర్చడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రూ.80 వేలు బాకీ తీర్చమంటే నిర్లక్ష్యంగా మాట్లాడటంతో పాటు, తమపై దౌర్జన్యానికి దిగేవాడని, అందుకే అతన్ని అంతమొందించాలని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. ఎస్‌ఐ సూర్యప్రకాశ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని