logo

శుద్ధియంత్రం మూలకు... ఇబ్బందులే నీళ్లకు

విశాఖపట్నం నగరం అక్కయ్యపాలెం ఎన్‌జీజీవోఎస్‌ కాలనీలో జీవీఎంసీ హైస్కూల్‌కు మొదటి విడత ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా మంచినీటి శుద్ధి పరికరం (ఆర్వో) ఏర్పాటు చేశారు. అయితే ఇది తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో సదరు నిర్వహణ సంస్థకు అధికారులు ఫిర్యాదులు చేస్తున్నా

Published : 05 Jul 2022 04:28 IST

- ఈనాడు, విశాఖపట్నం


పని చేయని నీటిశుద్ధి యంత్రం

విశాఖపట్నం నగరం అక్కయ్యపాలెం ఎన్‌జీజీవోఎస్‌ కాలనీలో జీవీఎంసీ హైస్కూల్‌కు మొదటి విడత ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా మంచినీటి శుద్ధి పరికరం (ఆర్వో) ఏర్పాటు చేశారు. అయితే ఇది తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో సదరు నిర్వహణ సంస్థకు అధికారులు ఫిర్యాదులు చేస్తున్నా వారు పూర్తిస్థాయిలో పట్టించుకోలేదు. ఒక్కోసారి ఉపాధ్యాయులే సొంత నిధులతో బాగు చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మళ్లీ మరమ్మతుకు గురవడంతో జీవీఎంసీ నుంచే ప్రస్తుత అవసరాలకు సరిపడా మంచినీటి టిన్నులను సరఫరా చేస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని