అర్హులకు ఆర్థిక చేయూత
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్(ప్రాయోజిత పథకం)కు అర్హులైన బాలలు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారామ్ విజ్ఞప్తి చేశారు.
మిషన్ వాత్సల్య కింద స్పాన్సర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం
ఏప్రిల్ 15 తుది గడువు
గొండు సీతారామ్
న్యూస్టుడే, ఎంవీపీకాలనీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్(ప్రాయోజిత పథకం)కు అర్హులైన బాలలు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారామ్ విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాల్లోపు ఉండి...రక్షణ, సంరక్షణ అవసరమైన వారి కనీస అవసరాలను తీర్చేందుకు ప్రతి నెలా ఆర్థిక చేయూత అందించటం జరుగుతుందన్నారు. ఈ పథకం గురించి ఆయన వివరిస్తూ.. అర్హులకు ఆర్థిక, ఇతరత్రా వైద్య, విద్య, అభివృద్ధి అవసరాలను తీర్చేందుకు మిషన్ వాత్సల్య కింద షరతులతో కూడిన సహాయం అందిస్తారని, .స్పాన్సర్షిప్ ద్వారా ఎంపికైన పిల్లలకు నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారని పేర్కొన్నారు.
వార్షికాదాయం :
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం రూ.72వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.96వేలకు మించకూడదు. కాల పరిమితి...జెజె బోర్డు, సీడబ్ల్యూసీ కోర్టు లిఖితపూర్వకంగా నమోదు చేసిన కారణాల ఆధారంగా అవసరాన్ని బట్టీ స్పాన్సర్షిప్ను పొడిగించవచ్చు. బీ ఏ సమయంలోనైనా స్పాన్సర్షిప్ అందుకుంటున్న బాలలు, ఏదైనా వసతిగృహం, బాల సదనంలో చేర్పించిన తర్వాత సహాయం నిలిపివేస్తారు. బీ ప్రత్యేక అవసరాలు కలిగిన బాలల విషయంలో మినహా పాఠశాలలకు వెళ్లే వారు పాఠశాల హాజరు 30 రోజులకుపైగా సక్రమంగా లేదని తేలినా సమీక్షించి, తాత్కాలికంగా నిలిపివేస్తారు.
ఎవరిని సంప్రదించాలి
మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ కోసం ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పాఠశాలలు, ఇతరత్రా ప్రాంతాల్లో బాలలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 15లోగా అర్హులైన బాలలచే దరఖాస్తు చేయిస్తున్నారు.
ఎవరు అర్హులు?
* అనాథలుగా ఉంటూ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న వారు
* తల్లి వితంతువు, విడాకులు తీసుకున్న, కుటుంబం విడిచిపెట్టిన పిల్లలు.
* తల్లిదండ్రులు ప్రాణాపాయ/ ప్రాణాంతక వ్యాధికి గురై ఉంటే...
* తల్లిదండ్రులు ఆర్థికంగా, శారీరకంగా అసమర్థులై పిల్లలను చూసుకోలేని కుటుంబంలోని వారు
* జువైనల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలు (ప్రకృతి వైపరీత్యానికి గురైన బాలలు, బాలకార్మికులు, అంగవైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వారు, బాల యాచకులు, వీధుల్లో నివసించే బాలలు, సహాయం, పునరావాసం అవసరమైన వారు, దోపిడీకి గురైన బాలలు)
* కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ‘పీఎం కేర్స్ ఫర్’ పథకం కింద నమోదైన వారు.
సంప్రదించాల్సిన నెంబర్లు:
జిల్లా ఇన్ఛార్జి బాలల సంరక్షణ అధికారి ఎం.రమేష్ (89789 17154), రక్షణ అధికారి మమత(98498 55562).
సంప్రదించాల్సిన కార్యాలయాలు
జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ప్రగతి భవన్, సెక్టారు-9, ఎంవీపీకాలనీ, విశాఖపట్నం.
* జిల్లా పరిధిలోని అర్బన్-1 ఐసీడీఎస్ కార్యాలయం, విశాఖ అర్బన్-2 ఐసీడీఎస్ కార్యాలయం, పెందుర్తి ఐసీడీఎస్, భీమిలి ఐసీడీఎస్ కార్యాలయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
జగన్ ఏలుబడిలో... అంగన్వాడీల అగచాట్లు
[ 07-05-2024]
అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఇందులో అంగన్వాడీలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. -
ఉద్యోగులపై వైకాపా ప్రలోభాల వల
[ 07-05-2024]
ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
వైకాపా హయాంలో..అన్నీ నేరాలే!
[ 07-05-2024]
వైకాపా హయాంలో విశాఖను గంజాయి హబ్గా మార్చారని విశాఖపట్నం కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్ విమర్శించారు. -
మూడు పార్టీల కూటమితోనే ఉత్తరాంధ్ర ప్రగతి
[ 07-05-2024]
‘యువత సైకిల్ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
సమస్యల్లో పరవాడ ‘మేజర్’
[ 07-05-2024]
పరవాడ మేజర్ పంచాయతీలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. -
శిశువులపై జగన్ కర్కశత్వం
[ 07-05-2024]
జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. -
చీకట్లో పోలింగ్ కేంద్రాలు.. కనిపించని గుర్తులు
[ 07-05-2024]
ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి. -
పింఛన్ లబ్ధిదారులకు తీరని అవస్థలు
[ 07-05-2024]
పింఛన్ బట్వాడా విషయంలో ప్రభుత్వ తీరుతో పేదల కష్టాలు కొనసాగుతున్నాయి. -
మాజీ పోలీసు ఇంట్లో రూ.9.99 లక్షలు స్వాధీనం
[ 07-05-2024]
జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ చేసిన నగదును సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎస్టీ) స్వాధీనం చేసుకుంది. -
చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు
[ 07-05-2024]
ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవన్ సూచించారు. -
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
[ 07-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్