ఆ వర్గాలకుసీట్లేవి?
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
యాదవ, గవరలకు వైకాపా మొండిచేయి
ఈనాడు-విశాఖపట్నం
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బలమైన గవర, యాదవ సామాజిక వర్గాల నాయకుల్ని అణగదొక్కి, వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు కేటాయించకుండా మొండిచేయి చూపడంపై ఆయా సామాజికవర్గాల నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఉపయోగించుకుని, ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టేస్తుండటంపై ఆ సామాజిక వర్గాల్లో వైకాపాపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
విశాఖలోయాదవులకు ఝలక్..
విశాఖ అర్బన్లో యాదవ సామాజిక వర్గాన్ని వైకాపా పూర్తిగా పక్కన పెట్టింది. తూర్పు టికెట్ ఆశించి, పార్టీలో గౌరవం ఇవ్వడం లేదంటూ యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ వైకాపా నుంచి బయటకు వచ్చిన విషయం విదితమే. అదే నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, వీఎంఆర్డీఏ మాజీ ఛైర్మన్ అక్కరమాని విజయనిర్మల ఆసక్తి చూపారు. అప్పటి వరకు తూర్పు ఇన్ఛార్జిగా ఉన్న అక్కరమానిని తప్పించి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కొత్తగా సమన్వయకర్త బాధ్యతలిచ్చి, ఇటీవల అభ్యర్థిగా వచ్చే ఎన్నికలకు ప్రకటించారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు అక్కరమాని వర్గం దూరంగా ఉంటూ వచ్చింది. అయితే సామాజిక సమీకరణల్లో భాగంగా అక్కరమానికి భీమిలి, మేయర్కు గాజువాక టికెట్ ఇస్తారంటూ సర్వేలతో హడావుడి చేసి అక్కడా మొండిచేయి చూపారు. తెదేపా కూటమి యాదవ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తూ గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు, విశాఖ దక్షిణంలో వంశీకృష్ణ శ్రీనివాస్కు అవకాశం కల్పించారు. వంశీకృష్ణ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని జనసేన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అనకాపల్లిలోగవర సామాజికవర్గం విస్మరణ
ఒక పక్క సామాజిక సాధికారిత అంటూ బస్సు యాత్రలు చేసిన వైకాపా, గవర సామాజిక వర్గానికి ఝలక్ ఇచ్చింది. తరతరాల నుంచి గవర సామాజికవర్గం ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో ఏ ఒక్కటీ ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీట్లలో ఏదో ఒకటి గవర సామాజిక వర్గానికి కేటాయించడం అనకాపల్లిలో ఆనవాయితీ. అయితే సిట్టింగ్ ఎంపీ సత్యవతికి సీటు ఇచ్చే అవకాశం లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి అసెంబ్లీ టికెట్ను కాపు సామాజిక వర్గానికి చెందిన మలసాల భరత్కు ఇవ్వడంతో, అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం గవర సామాజికవర్గానికి చెందిన బొడ్డేటి కాశీ విశ్వనాథ్, పీలా రమాకుమారిలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీరిద్దరినీ, సిట్టింగ్ను కాదని బూడి ముత్యాలనాయుడును ఎంపీ అభ్యర్థిగా వైకాపా ప్రకటించడం గమనార్హం.
ఇక్కడ తెదేపా పొత్తులో గవర సామాజికవర్గానికి చెందిన జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు అసెంబ్లీ టికెట్ను కేటాయించారు. ఉమ్మడి విశాఖలో గవర సామాజికవర్గం బలంగా ఉంది. అనకాపల్లిలో 19.46% గవర సామాజిక ఓటర్లు ఉన్నారు. యలమంచిలిలో 23.13%, పెందుర్తిలో 7.37%, మాడుగులలో 4.87%, చోడవరంలో 5.77%, నర్సీపట్నంలో 2.65%, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 7.55%, గాజువాకలో 5.77% ఓటర్లున్నారు. విశాఖ గ్రామీణ పరిధిలో గవర సామాజికవర్గాన్ని పక్కన పెట్టడంపై ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పేందుకు నాయకులు అంతర్గతంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా