కుమరాంలో భారీ చోరీ
జామి మండలంలోని కుమరాం పంచాయతీ కల్యాణ నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 50 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు
50 తులాల చొప్పున బంగారం, వెండి అపహరణ'
పరిశీలిస్తున్న సీఐ సింహాద్రినాయుడు తదితరులు
జామి, న్యూస్టుడే: జామి మండలంలోని కుమరాం పంచాయతీ కల్యాణ నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 50 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్ఎంపీగా సేవలందిస్తున్న పిన్నింటి ప్రసాదరావు ఈనెల 19న తన కుమార్తె, భార్యతో కలిసి బిలాస్పూర్ వెళ్లారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం వారి ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు వచ్చిన స్థానిక మహిళ కర్రి పాపయ్యమ్మ తలుపు తాళాలు తీసి ఉండడాన్ని గమనించింది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలు తెరిచి ఉండడం, దుస్తులు చిందరవందరగా పడి ఉండడం చూసి వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చింది. ఈక్రమంలో ఎస్.కోట మండలం సీతంపేటలో ఉంటున్న మరో కుమార్తె గాయత్రి విషయం తెలుసుకుని భర్త రాజేష్తో కలసి హుటాహుటిన అక్కడి చేరుకున్నారు. నగలు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ సింహాద్రి నాయుడు, ఎస్సై వీరబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూటీం వచ్చి ఆధారాలు సేకరించింది. యజమాని లేకపోవడంతో ఎంత చోరీకి గురైందో ఇంకా తెలియలేదు. తమకున్న సమాచారం ప్రకారం 50 తులాల బంగారం, 50 తులాల వెండి పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకుని, కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.