దిగుబడిపై అన్నదాతల దిగులు
జిల్లాలో యాసంగి సాగు రైతులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. సాధారణంగా వానాకాలంలో దిగుబడి తక్కువ రావడం, కోత సమయంలో అధిక వర్షాలతో నాణ్యత దెబ్బతినడం, పంట నీటి పాలు కావడం తదితర ఇబ్బందులుండేవి.
వెంకిర్యాలలో పచ్చదనంతో కనిపిస్తున్న పొలం
జనగామ రూరల్, న్యూస్టుడే: జిల్లాలో యాసంగి సాగు రైతులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. సాధారణంగా వానాకాలంలో దిగుబడి తక్కువ రావడం, కోత సమయంలో అధిక వర్షాలతో నాణ్యత దెబ్బతినడం, పంట నీటి పాలు కావడం తదితర ఇబ్బందులుండేవి. యాసంగి సీజన్లో వరి సాగుకు అనుకూలమైన వాతావరణం తోడు కావడంతో పంట దిగుబడిపై రైతులకు ధీమా ఉండేది. ఈసారి ధాన్యం కొనుగోలుపై సందిగ్ధతతో రైతులు ఆలస్యంగా సాగు చేశారు. మరో వైపు ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి తగ్గడానికి కారణమవుతోంది. ఏటా వానాకాలం కంటే యాసంగి సీజన్లో అధిక దిగుబడులు వచ్చేవి. ఈ యేడు మాత్రం రైతులకు నిరాశనే మిగులుస్తున్న వైనంపై ‘న్యూస్టుడే’ కథనం.
కొనుగోలుపై సందిగ్ధం..
రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేది లేదని, ప్రత్యామ్నాయ, ఇతర పంటలను సాగు చేసుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ సూచన మేరకు ప్రత్యామ్నాయ పంటలకు ఈ ప్రాంత భూములు పెద్ద మొత్తంలో అనుకూలంగా లేకపోవడం, కోతుల బెడద వంటి కారణాలతో రైతులకు ఏ పంట వేసుకోవాలో తెలియని ఆందోళనకర పరిస్థితి. చివరికి చేసేది లేక రైతులు వరి సాగుపై మొగ్గు చూపారు.
సహకరించని వాతావరణం..
సాధారణంగా డిసెంబరు నుంచి జనవరి 15లోగా వరి నాట్లు వేసుకోవాలి. కానీ రైతులు జనవరి నుంచి ఫిబ్రవరి చివరి దాకా వరి నాట్లు కొనసాగాయి. నిర్ణీత సమయంలో నాట్లు పూర్తైతే ఏప్రిల్ 15 నాటికి కోతలు పూర్తయ్యేవి. ఇంకా క్షేత్ర స్థాయిలో సుమారు 30 శాతం పొలాలు పచ్చదనంతోనే కనిపిస్తున్నాయి. జూన్ మొదటి వారం వరకు వరి కోతలు జరిగే అవకాశమేర్పడింది. నాట్లు పూర్తయ్యాక ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో మంచు కురియడం ఆగిపోయేది. కానీ ఈ యేడు మాత్రం మార్చిలోనూ మంచు కురియడంతో పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి. పంట సాగు ఆలస్యం కావడం.. తెగుళ్ల నుంచి కోలుకునేందుకు సమయం, ఏప్రిల్లో ఎండల తీవ్రతకు పంట పుష్పించే(ఈనె) దశకు చేరడంతో ఆ పుష్పాలు ఎండ తీవ్రతతో దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడిపై పెద్దగా ప్రభావం చూపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ