logo

రామప్పను సందర్శించిన మండలి బుద్ధ ప్రసాద్‌

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌ బుద్ధ ప్రసాద్‌ సోమవారం సందర్శించారు.

Published : 29 Nov 2022 03:51 IST

వెంకటాపూర్‌ (ములుగు జిల్లా), న్యూస్‌టుడే: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌ బుద్ధ ప్రసాద్‌ సోమవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు.. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం టూరిజం గైడ్లు ఆలయ చరిత్రను, శిల్పకళా వైభవాన్ని గురించి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని