వంతెన లేక గిరిజనుల వెతలు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు మెరుగైన రవాణాకు పెద్దపీట వేస్తోంది. రహదారుల నిర్మాణానికి రూ.కోట్ల నిధులు వెచ్చిస్తోంది.
వెంకటాపురం-మల్లాపురం మధ్య కంకలవాగుపై వారధి నిర్మించాల్సింది ఇక్కడే..
వెంకటాపురం(ములుగు జిల్లా), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు మెరుగైన రవాణాకు పెద్దపీట వేస్తోంది. రహదారుల నిర్మాణానికి రూ.కోట్ల నిధులు వెచ్చిస్తోంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉన్న చోట వారధుల నిర్మాణం చేపట్టకపోవడంతో గిరిజనం కష్టాలు పడాల్సి వస్తోంది. వెంకటాపురం మండలంలోని మల్లాపురం, కర్రివానిగుంపు గిరిజనులు వర్షాకాలంలో కంకలవాగు వల్ల రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. తారుదారి నిర్మించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఓ మోస్తరు వర్షానికే వాగు ఉప్పొంగి రోజుల తరబడి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రూ.4.11 కోట్లతో ప్రతిపాదనలు
కంకలవాగుపై వంతెన నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. తొలుత ఇక్కడ రూ.25 లక్షలతో శ్లాబ్ కల్వర్టు నిర్మించేందుకు నిధులు కేటాయించినా ఆ పనులను రద్దు చేశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రత్యేక కోటా కింద రూ.4.11 కోట్ల నిధులతో హైలెవల్ వంతెన కట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఇటీవలే టెండరు ప్రక్రియ సైతం పూర్తైనట్లు తెలుస్తోంది. వారధి నిర్మించేందుకు ఇదే అనువైన సమయం. అధికారులు త్వరితగతిన పనులు చేపడితే వచ్చే వానాకాలంలోనైనా గిరిజనులకు మోక్షం కలిగే అవకాశం ఉంటుంది.
త్వరలో పనులు ప్రారంభిస్తాం: రాజేశ్, పీఆర్ ఏఈఈ
వంతెన నిర్మాణానికి సంబంధించి ఇటీవల టెండరు ప్రక్రియ పూర్తైనట్లు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. వరంగల్కు చెందిన ఓ గుత్తేదారు ఈ పనులు దక్కించుకున్నట్లు తెలిసింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వర్షాకాలంలో రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకుంటాం.
వాగు ఉప్పొంగితే రాకపోకలు బంద్
మల్లాపురం, కర్రివానిగుంపు గిరిజన గ్రామాలకు మండల కేంద్రానికి చేరువ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పీఎంజీఎస్వైలో భాగంగా రహదారి ఆధునికీకరణ, కల్వర్టు నిర్మాణానికి రూ.3.62 లక్షలు మంజూరు చేసింది. దాదాపు 5.3 కి.మీ మేరకు అధికారులు మట్టిరోడ్డును తారుదారిగా మార్చారు. గ్రామాల్లో సిమెంట్ రహదారులను నిర్మించారు. పలు ప్రాంతాల్లో కల్వర్టులను కట్టారు. కానీ ఈ మార్గంలోని కంకలవాగుపై వారధి నిర్మాణం చేపట్టకపోవడంతో వానాకాలంలో అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతేడాది జులై, ఆగస్టులో కురిసిన వర్షాలకు దాదాపు నెల రోజులకు పైగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచాయి. అత్యవసర సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్