శిఖం భూములపై ఉదాసీనత
గ్రేటర్ వరంగల్ పరిధిలో చెరువులు, కుంటలు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమణలకు తెగబడుతున్నారు.
చెరువులో మట్టిని నింపుతూ..
కార్పొరేషన్, న్యూస్టుడే: గ్రేటర్ వరంగల్ పరిధిలో చెరువులు, కుంటలు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. వరంగల్- హనుమకొండ నగర నడిబొడ్డున భద్రకాళి చెరువును ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. హనుమకొండ పద్మాక్షిగుట్ట రోడ్డులో వందల కొద్దీ టిప్పర్లతో మట్టిని తరలిస్తూ.. చెరువు నింపుతున్నారు. ఆరేడు నెలలుగా భద్రకాళి చెరువు శిఖం భూములు గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి చదును చేస్తున్నారు. అడిగితే ప్రైవేటు పట్టా భూములని చెబుతున్నారు. పది రోజుల క్రితం భద్రకాళి చెరువు కట్టను తెంచేసి మురుగు మళ్లించారు. ఈనెల 23న ‘ఈనాడు’లో కథనం రావడంతో గురువారం గ్రేటర్ వరంగల్ అధికారులు కట్టను పూడ్చేశారు. ఫుల్ ట్యాంకు లెవల్(ఎఫ్టీఎల్) నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని, ప్రైవేటు వ్యక్తులు చెరువులో మట్టి నింపుతున్నారని సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేసినా.. అధికారులు కదలడం లేదనే విమర్శలున్నాయి.
స్పందించని అధికారులు
హనుమకొండ ప్రాంతంలో కాకతీయ సమాధుల స్థలాల అన్యాక్రాంతంపై సామాజిక కార్యకర్త రాజు ఫిర్యాదు చేశారు. హనుమకొండ మండలం సర్వేనంబరు 910లో 8.03 ఎకరాలు, సిద్దేశ్వర గుండం సర్వేనంబరు 911లో 1.30 ఎకరాలు ప్రభుత్వ భూములే అని అప్పటి హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, ఆర్డీవో వాసుచంద్ర 20-12-2021 నాడు రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ భూములేనని అధికారులు సమాధానం ఇచ్చి ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం లేదని సామాజిక కార్యకర్తలు, స్థానికులంటున్నారు. లెప్రసీ కాలనీ నుంచి ప్రైవేటు నర్సింగ్ కళాశాల వరకు భద్రకాళి చెరువు శిఖం భూములు చేజారే పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
పద్మాక్షిగుట్ట వైపు భద్రకాళి చెరువును చదును చేస్తూ..
హద్దులు తేల్చకపోవడంతో..
హనుమకొండ పద్మాక్షిగుట్ట, న్యూశాయంపేట రోడ్డు, భద్రకాళి ఫోర్ షోర్ బండ్ దిగువన ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములకు హద్దులు లేవు. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా ప్రైవేటు వ్యక్తులు హద్దులు ఖరారు చేసి, ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. ఇప్పటికే భద్రకాళి చెరువు, పద్మాక్షమ్మ, సిద్దేశ్వరస్వామి, వీరపిచ్చమాంబ, హనుమకొండ గుట్ట స్థలాల అన్యాక్రాంతంపై లోకాయుక్త న్యాయస్థానం సీరియస్గా ఉంది. వచ్చే జూన్ నెలాఖరు నాటికి సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి జిల్లా దేవాదాయ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంతవరకు అడుగు పడటం లేదు. సర్వే చేస్తే వాస్తవాలు బయట పడే అవకాశాలున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
[ 05-05-2024]
వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ నగరంలో చోటుచేసుకొంది. -
ఈ పసిబిడ్డ.. మట్టిలో పుట్టిన సీత..!
[ 05-05-2024]
రామాయణంలో సీత మట్టిలో నుంచి పుట్టినట్టు చెబుతారు. పాపాల ఈ కలియుగంలోనూ ఓ ఆడబిడ్డ మట్టిలో నుంచి ఊపిరి పోసుకుంది. నాడు జనకుడికి సంతానం లేకపోతే జానకి వరంగా భూమిలో నుంచి జన్మించింది. -
నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు పూర్తి
[ 05-05-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న పోలింగ్ నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలోని 5 నియోజక వర్గాలకు ఈవీఎంలు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. -
ఓరుగల్లులో అరూరి గెలుపు ఖాయం
[ 05-05-2024]
వరంగల్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు ఖాయమైందని వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు. -
శిక్షలు పడితే నేరాల సంఖ్య తగ్గుతుంది
[ 05-05-2024]
సమాజంలో నేరం చేసిన వారికి శిక్షలు పడితే నేరాల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. -
మేడారం జాతీయ హోదా.. చిరకాల వాంఛ!
[ 05-05-2024]
ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది. -
మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
[ 05-05-2024]
ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
పేదలకు ఉచితంగా న్యాయ సేవలు
[ 05-05-2024]
జిల్లా కేంద్రంలోని సఖి వన్స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీˆనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కన్నయ్యలాల్ శనివారం సందర్శించారు. -
వారధి నిర్మాణ పనులు వేగవంతం
[ 05-05-2024]
ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామం నుంచి ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో మాటొర్రెపై నిర్మిస్తున్న వారధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
పీఎంశ్రీ పాఠశాలలకు సిరి!
[ 05-05-2024]
పాఠశాలల్లో పలు వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది. -
‘భాజపాకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు’
[ 05-05-2024]
గత పదేళ్ల పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా నిరంకుశ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న భాజపాకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ఇంటి వద్దే.. ఓటేశారు!
[ 05-05-2024]
ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా భూపాలపల్లి నియోజకవర్గంలో తొలిరోజు శనివారం 42 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పురపాలిక స్థలాలు.. ఆక్రమణల పర్వం
[ 05-05-2024]
పాలకవర్గం పట్టింపు లేమి, అధికారుల ఉదాసీనత, అక్రమాలకు అండగా నిలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల కారణంగా జనగామ పురపాలికకు చెందిన విలువైన ఆస్తులు, ఖాళీ స్థలాలు చేజారుతున్నాయి. -
ఆర్టీసీ కార్గో సేవలు అధ్వానం
[ 05-05-2024]
హనుమకొండలోని ఆర్టీసీ కార్గో సేవలపై వినియోగదారులు మండిపడుతున్నారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పాటు వినియోగదారులే చరవాణికి ఫోన్ చేసినా స్పందించకపోవడం, పార్శిల్ వస్తే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వకపోవడం, -
ప్రజాస్వామ్య పండగకు ఆహ్వానం..!
[ 05-05-2024]
ఒక శుభకార్యానికి ఆహ్వానించినట్లుగా ఓటు వేయడానికి రమ్మనే పిలుపుతో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. -
పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసులకు అనుమతి ఉండదు
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలక పాత్ర. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో వారి బాధ్యత చెప్పదగినది. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు మాత్రం వారికి అనుమతి ఉండదు.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్