logo

రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు.

Updated : 10 May 2024 05:55 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మురళీనాయక్‌

ఇనుగుర్తి, కేసముద్రం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధికి నాంది పలికాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌కు మద్దతుగా మురళీనాయక్‌ ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి, అయ్యగారిపల్లి, చిన్ననాగారం, కేసముద్రం మండలంలోని బిచ్చానాయక్‌, బ్రహ్మంగారితండా, చైతన్యనగర్‌, ఎన్టీఆర్‌నగర్‌లో ఇల్లిల్లు తిరిగి కాంగ్రెస్‌ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థించారు. ఇనుగుర్తి మండల పార్టీ అధ్యక్షుడు కూరెళ్లి సతీష్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.400 చేస్తామన్నారు. ప్రస్తుతం దేశానికి యువ నాయకత్వం అవసరమని, రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలందరూ శ్రమించాలన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బలరాంనాయక్‌ను అత్యధిక మెజార్గీతో గెలిపించాలన్నారు. ఇనుగుర్తి, కేసముద్రం మండలాల పార్టీ నాయకులు అశోక్‌గౌడ్‌, సంజీవరెడ్డి, కుమార్‌, రాజేందర్‌రెడ్డి, గంట సంజీవరెడ్డి, అల్లం నాగేశ్వర్‌రావు, అంబటి మహేందర్‌రెడ్డి, రావుల మురళి, మేకల వీరన్నతోపాటు సీపీఎం, సీపీఐ నాయకులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని