మహిళలకు తోడూనీడ.. సఖి
బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ.
మహబూబాబాద్లో అవగాహన కల్పిస్తున్న సఖి బృందం సభ్యురాలు
మహబూబాబాద్, నెహ్రూసెంటర్, న్యూస్టుడే: బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ. వివిధ రకాల వేధింపులు, గృహహింసకు గురవుతున్న వనితలకు తోడుగా నిలిచి వారిలో భయాన్ని పోగొడుతూ భరోసానిస్తున్న సఖి కేంద్రం మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతోంది. 2019లో షేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ మూడున్నరేళ్లుగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ సేవలందిస్తోంది.
ఆపదలో ఉన్నవారు ఫోన్ కాల్ చేస్తే సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి వారికి రక్షణ కల్పిస్తారు. ఇందుకోసం సఖి కేంద్రంలో అడ్మిన్, లీగల్ అడ్వయిజర్, ఇద్దరు కౌన్సెలర్లు, ఏఎన్ఎంలు ఇద్దరు, మరో ఏడుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నర్సంపేట రోడ్లో ప్రభుత్వం ఈ కేంద్రానికి సొంత భవనం నిర్మాణం చేసింది.
హెల్ప్లైన్ ద్వారా..
- జిల్లాలో 181 హెల్ప్లైన్ ద్వారా 862 ఫోన్ కాల్స్ వచ్చాయి. వీటిలో 222 కేసులను తీసుకున్నారు. వంద మంది బాధితులను కాపాడారు.
- కేంద్రానికి 1255 బాధితుల్లో 650 మందికి ఆశ్రయం కల్పించారు.
- 240 మందికి వైద్య సేవలను అందించారు.
- స్వధార్, ఆశ్రయ, ఇతర గృహాలకు 30 మంది బాధితులను పంపించారు.
- బాధితులైన 34 మందికి రూ. 8.87 లక్షలు పరిహారంగా ఇప్పించారు. ఇందులో యాసిడ్ బాధితురాలికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు.
- 248 కేసులకు సంబంధించి పోలీసుల సహాయం తీసుకున్నారు.
- సఖి బృందం సభ్యులు వివిధ ప్రాంతాల్లో 974 అవగాహన కార్యక్రమాలను నిర్వహించగా వీటిలో 73,872 మంది పాల్గొన్నారు. లీగల్ కౌన్సెలింగ్, సైకో సోషల్ కౌన్సెలింగ్ నిర్వహించారు.
పలు కేసుల్లో బాధితులకు అండగా
- జిల్లాలోని ఓ గ్రామంలో భార్యపై యాసిడ్ పోసి చంపేశాడు. తర్వాత అతను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి పిల్లలు అమ్మమ్మ-తాతయ్య దగ్గర ఉంటున్నారు. తమ కూతురికి అన్యాయం జరిగిందని మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారులను సంప్రదించగా బాధితురాలి పిల్లలకు అమ్మమ్మ పేరిట బ్యాంక్లో జాయింట్ ఎకౌంట్ తీసి రూ.75,000 రెండు విడతలుగా అందించారు.
- భర్తతో గొడవ పడిన ఓ మహిళా తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్మ చేసుకోవడానికి వచ్చిందని డోర్నకల్ రైల్వే పోలీసులు సఖి కేంద్రానికి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే సిబ్బంది వారిని కేంద్రానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. అనంతరం పిల్లల జీవితాలను మెరుగుపరిచి వారిని ఉన్నత స్థితికి తీసుకురావాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ మహిళా ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకొని ధైర్యంగా పిల్లలతో కలిసి జీవనం గడుపుతున్నారు.
- ప్రేమ వివాహం చేసుకున్న భర్త మద్యానికి బానిసై పని లేకుండా తిరుగుతున్నాడు. జన్మించిన పాపను కూడా పట్టించుకోక పోవడంతో తొర్రూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. నేడు ఆ దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!