logo

భర్తను కొట్టిన రెండో భార్య

ఆస్తి తగాదాల నేపథ్యంలో భర్తపై అతని రెండో భార్య దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక కత్తేపువీధికి చెందిన షేక్‌ సాయిబాబా మహ్మద్‌ రిజ్వాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు, ఆమె పిల్లలకు ఆస్తి ఎక్కువ ఇచ్చారని,

Published : 20 Jan 2022 08:12 IST

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆస్తి తగాదాల నేపథ్యంలో భర్తపై అతని రెండో భార్య దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక కత్తేపువీధికి చెందిన షేక్‌ సాయిబాబా మహ్మద్‌ రిజ్వాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు, ఆమె పిల్లలకు ఆస్తి ఎక్కువ ఇచ్చారని, తనకు లేకుండా చేశారని సాయిబాబాతో రిజ్వాన్‌ గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 18న రాత్రి కుక్కర్‌తో భర్త తలపై దాడి చేయగా తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు సాయిబాబాను ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్సపొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రిజ్వాన్‌పై వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు