ఎగసిపడ్డ మంటలు.. తీవ్రంగా గాయపడ్డ బాలుడు
ఆకివీడులో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలతో నివాసిత ప్రాంతాల పరిధిలో ఉండే చిన్న చెత్తకుప్పను తగులబెట్టాలన్నా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
చెత్తే కదా అని తగులబెడితే ముప్పు
మంటల్లో గాయపడ్డ మహేష్
ఆకివీడు, న్యూస్టుడే: ఆకివీడులో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలతో నివాసిత ప్రాంతాల పరిధిలో ఉండే చిన్న చెత్తకుప్పను తగులబెట్టాలన్నా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చెత్తే కదా అని తగలబెడితే ప్రాణాల మీదకు వస్తున్న సంఘటనలు ఆకివీడులో చోటుచేసుకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు ఆకివీడు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రెడ్డి వీధిలో ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్న చెత్త కుప్పను ఆదివారం సాయంత్రం తగులబెట్టాడు. సమీపంలో ఇద్దరు బాలురు ఆడుకుంటున్నారు. చెత్త కుప్ప నుంచి ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటనలో బొడ్డు మహేష్(11) శరీర భాగాలు కాలి తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గాయపడ్డ బాలుడిని తొలుత ఆకివీడులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనంతరం భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ నెలలో ఇది రెండో సంఘటన. మొదటిది ఆకివీడులోని అయిభీమవరం రోడ్డు కూడలి సమీపంలో ఒక ఎరువులు దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న రామబోయిన సుబ్రహ్మణ్యం (53) ఈ నెల 8వ తేదీన ఉదయం సుమారు 11 గంటల సమయంలో దుకాణం సమీపంలో పాత కాగితాలు, చెత్తను తగులబెట్టగా ఒక్కసారిగా భారీస్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో సుబ్రహ్మణ్యం ముఖం, చేతులు కాలి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ సుబ్రహ్మణ్యాన్ని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికీ ఆయనకు పూర్తిస్థాయిలో గాయాలు మానలేదు. కాగితాలు తగులబెట్టిన ప్రాంతంలో నాటు తుపాకీకి వినియోగించే చిన్న ఇనుప గుళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన మరిచి పోకుండానే ఆదివారం ఈ ఘటన జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలకేయులను రాష్ట్రం నుంచి తరిమికొడదాం
[ 07-05-2024]
రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచుకునే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. -
మత్స్య విలాపం
[ 07-05-2024]
నాలుగు దశాబ్దాలుగా దేశానికి పోషకాహారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగం జగన్ ఏలుబడిలో చతికిలబడింది. డెల్టా ప్రాంతంలో నీలివిప్లవంతో మొదలైన చేపల పరిశ్రమ అయిదేళ్లుగా ఎన్నడూ లేనంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. -
అణచివేతలతో అరాచక పర్వం
[ 07-05-2024]
-
ఉద్యోగుల ఓట్లకూ గేలం
[ 07-05-2024]
సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఓటేయకుండా చూడాలనే ప్రభుత్వ పన్నాగంలో భాగంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లకు మోకాలడ్డారన్న విమర్శలున్నాయి. -
తొలి రోజు ఓటేసిన 7,540 మంది
[ 07-05-2024]
జిల్లాలో తపాలా బ్యాలెట్ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మొత్తం 13,854 మంది ఓటర్లు ఉండగా తొలిరోజు 7,540 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు -
జగన్ వస్తే పెట్రోలు సరఫరా ఉండదట!
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. -
మావయ్యా.. మా బాల్యంతో ఆడుకున్నావ్!
[ 07-05-2024]
ప్రతి అక్కచెల్లెమ్మల బిడ్డలకు నేను మేనమామ లెక్క. ఆ హోదాలో వారి చదువులు సాగించేందుకు అండగా నిలబడి నేను తోడుంటా.. అంటూ ప్రతి సభలోను ఊదరగొట్టే సీఎం జగన్ పురిటి బిడ్డ మొదలుకుని 15 ఏళ్ల బాలబాలికల బాల్యం కోసం చేసిందేమీలేదు. -
రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీయేను గెలిపించండి
[ 07-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా తయారైందని, భావితరాల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని సినీ హీరో నారా రోహిత్ అన్నారు -
కాలువ కన్నీరు పెడుతోంది
[ 07-05-2024]
పదిహేను వేల ఎకరాలకు నీరందించాల్సిన ఎర్రకాలువ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ఇది. సుమారు 20 కిలోమీటర్ల మేర గుర్రపుడెక్కతో నిండిపోయింది. -
వైద్యం బహుభారం
[ 07-05-2024]
నూజివీడు డిపోకు చెందిన ఒక మెకానిక్ భార్యకు ఏడాదిన్నర కిందట జబ్బు చేసింది. ఈహెచ్ఎస్ సదుపాయంతో ఆమెకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని ఆయన భావించారు. -
ఓటర్లకు తాయిలాలు..నాయకులకు ప్యాకేజీలు!
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇప్పటికే నగదు, చీరలు పంపిణీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. -
పేద విద్యార్థులకు ఉచిత విద్య
[ 07-05-2024]
ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ కేటగిరీకి చెందిన పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎ.సర్వేశ్వరరావు తెలిపారు. -
ఆసరా సొమ్ము కోసం రోడ్డెక్కిన మహిళలు
[ 07-05-2024]
వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సొమ్ములు వెంటనే చెల్లించాలని కోరుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు సోమవారం మొగల్తూరు క్రాంతి పథం కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?