కానరాని పల్లె వెలుగులు
గుడివాడ, కైకలూరు, ముదినేపల్లిలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అనేకమంది విద్యార్థులు చదువుతున్నారు.
కలిదిండి, ముదినేపల్లి, కైకలూరు, న్యూస్టుడే: గుడివాడ, కైకలూరు, ముదినేపల్లిలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అనేకమంది విద్యార్థులు చదువుతున్నారు. వారంతా ఆటోలు, ప్రైవేటు వాహనాలపైనే నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి 7 గంటలు దాటితే ఆటోలు అందుబాటులో లేక కళాశాలల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర డిపోల బస్సులు ఆపకపోవటంతో ఇటీవల విశ్వనాద్రిపాలెం వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
బస్సుల కోసం ‘శివారు’ ప్రజల ఎదురుచూపులు
* కలిదిండి మండలంలో పెదలంక నుంచి కైకలూరు మీదుగా ఏలూరు వెళ్లే బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో భీమవరం నుంచి కొండంగి మీదుగా పెదలంకకు ఒక బస్సు, గుడివాడ నుంచి మూలలంక మీదుగా పెదలంక వరకు మరొకటి తిప్పేవారు. రహదారులు అధ్వానంగా ఉండటËంతో భీమవరం నుంచి పెదలంకకు వెళ్లే సర్వీసును నిలిపివేశారు. కోరుకొల్లు నుంచి కైకలూరుకు బస్సు సర్వీసును నడపాలని చాలాకాలంగా కోరుతున్నప్పటికీ నెరవేరలేదు.
జిల్లా కేంద్రానికి బస్సు సదుపాయం ఉండాలి..
జిల్లాల పునర్విభజన తరవాత ఏలూరు వెళ్లాల్సిన అవసరం పెరిగింది. పెదలంక నుంచి నేరుగా ఏలూరు వెళ్లాలంటే ఆటోలో కలిదిండి వెళ్లి.. అక్కడ నుంచి మరో ఆటోలో కైకలూరు వెళ్లాల్సిన పరిస్థితి. బస్సులు ఏర్పాటు చేస్తే 10 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది.
దుగ్గిరాల పరమేశ్వరరావు, పెదలంక, కలిదిండి మండలం
* కైకలూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్టీసీ బస్సు సదుపాయం లేక అవస్థలు పడుతున్నారు. గతంలో కృష్ణాజిల్లాలో ఉన్నప్పుడు కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లోని శివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రహదారులు ధ్వంసం కావడంతో అక్కడక్కడా తిరిగే ఒకటీ, రెండు బస్సులను కూడా నిలిపివేశారు. ఏలూరు జిల్లాలో విలీనమయ్యాక ఈ సమస్య మరింత జటిలంగా మారింది. ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి, కైకలూరు మండలాల నుంచి నేరుగా ఏలూరు వెళ్లడానికి బస్సులు లేవు. శివారు గ్రామాల నుంచి మండల కేంద్రానికి, అక్కడి నుంచి కైకలూరు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి.
* పెదలంక నుంచి కలిదిండి, కైకలూరు మీదుగా, ముదినేపల్లి నుంచి కోరుకొల్లు, కైకలూరు మీదుగా ఏలూరుకు రోజువారీ సర్వీసులతో పాటు ద్వారకాతిరుమలకు ప్రతి శనివారం బస్సు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపింపామని స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు.
* ఇటీవల ముదినేపల్లిలో బస్సు ఖాళీ లేదని బొమ్మినంపాడు గ్రామానికి చెందిన విద్యార్థులను కిందకి దించేశారు. ఆ గ్రామానికి ఆర్డినరీ సర్వీసు లేకపోవడంతో ఇంటికి వెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు
* ముదినేపల్లి మండలం కొరగుంటపాలెం గ్రామానికి చెందిన మౌనిక ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. 5 గంటలకు తరగతులు ముగిశాక గ్రామానికి వెళ్లే బస్సులు ఉండటం లేదు. బంటుమిల్లి వెళ్లే బస్సు ఎక్కి సింగరాయపాలెం వద్ద దిగి, అక్కడి నుంచి ఆటోలో స్వగ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. ఇంటికి వెళ్లేసరికి ఒక్కోసారి రాత్రి 8 గంటలు అవుతుందని ఆమె వాపోయారు. కళాశాల వదిలే సమయానికి పల్లె వెలుగు బస్సు అందుబాటులో ఉంటే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
ఇదీ పరిస్థితి
* ముదినేపల్లి మండలంలో చిగురుకోట, కాకరవాడ, చినకామనపూడి, పెదకామనపూడి, వాడవల్లి తదితర గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. కైకలూరు నుంచి గుడివాడకు రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత బస్సు ఉండకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే సింగరాయపాలెం నుంచి కోరుకొల్లు వెళ్లేందుకు ఆర్టీసీ ప్యాసింజర్ సర్వీసు లేకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
* కైకలూరు మండలంలో రామవరం నుంచి కైకలూరుకు గతంలో ఉన్న సర్వీసును రద్దు చేయడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. కైకలూరు నుంచి ఆలపాడు మీదుగా పందిరిపల్లెగూడెం వెళ్లే మార్గంలో బస్సు ఏర్పాటు చేయాలని లంకగ్రామాల ప్రజలు కోరుతున్నా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.