logo

గంజాయి మూలాలపై నిఘా : డీజీపీ

గంజాయి మూలాల నుంచి సరఫరా ప్రాంతాలు, విక్రయాలు చేసేవారిపై నిఘా ఉంచామని డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.

Published : 29 Jan 2023 05:19 IST

రాజేంద్రనాథ్‌ రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న పాలరాజు, రవిప్రకాశ్‌

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: గంజాయి మూలాల నుంచి సరఫరా ప్రాంతాలు, విక్రయాలు చేసేవారిపై నిఘా ఉంచామని డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. భీమవరం విష్ణు విద్యా సంస్థల ప్రాంగణంలోని సమావేశం మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  రహదారి ప్రమాదాల తీవ్రత ఎక్కడ ఎక్కువగా ఉందో, అందుకు కారణాలు విశ్లేషించి నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు.   సమావేశంలో డీఐజీ పాలరాజు, ఎస్పీ యు.రవిప్రకాశ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని