సంక్షోభం దిశగా సంక్షేమం!
విద్యా దీవెన, వసతి దీవెన అంటూ గొప్పలు చెబుతున్న సర్కారు మాటలు వసతి గృహాల తలరాతను మార్చలేకపోతున్నాయి.
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
* ఇక్కడ సుమారు వంద మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఇరుకు గదులు, వెలుతురు లేకుండా ఉన్న గదుల్లో మగ్గిపోతున్నారు. ఇక్కడ మరుగుదొడ్లు సైతం అధ్వానంగా మారాయి. భవనానికి నెలకు రూ.49,500 వరకు అద్దె చెల్లిస్తున్నారు.
* తణుకు పట్టణం ఇరగవరం కాలనీలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహం ఇది. శ్లాబు పెచ్చులుపెచ్చులుగా ఊడి ఊచలు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే నీరు కారుతోంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ పాఠశాల స్థాయి 28, కళాశాల స్థాయి విద్యార్థినులు 26 మంది ఉన్నారు.
తణుకు, తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: విద్యా దీవెన, వసతి దీవెన అంటూ గొప్పలు చెబుతున్న సర్కారు మాటలు వసతి గృహాల తలరాతను మార్చలేకపోతున్నాయి. పాఠశాల, కళాశాల సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. అరకొర వసతులతో ఈసూరోమంటూ సంక్షోభం దిశగా ‘సంక్షేమం’ పయనిస్తోంది. ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన హాస్టళ్లు పలు చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన దినసరి భోజన పట్టిక ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోంది.
కేవలం రూ.1400
వసతి గృహంలో ఉంటున్న ఒక్కో కళాశాల విద్యార్థికి రూ.1400 మాత్రమే సర్కారు చెల్లిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఆధారంగా నాణ్యమైన ఆహారం అందించాలంటే ప్రస్తుత రేట్లు ప్రకారం రూ.రెండు వేల నుంచి రూ.2500 వరకు ఖర్చు అవుతోంది. కరోనా తర్వాత నిత్యావసరాల ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2018 తర్వాత మెస్ ఛార్జీలను పెంచలేదు. దీనికితోడు నెలలు తరబడి బిల్లులను మంజూరు చేయకపోవడంతో నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు.
* తాడేపల్లిగూడెం పట్టణంలో నాలుగు సాంఘిక సంక్షేమ, రెండు బీసీ వసతి గృహాలున్నాయి. వాటిల్లో సుమారు 295 విద్యార్థులు ఉంటున్నారు. వీటిలో రెండు మినహా మిగిలినవన్నీ అద్దె భవనాల్లో ఉన్నాయి. రూ.వేలల్లో అద్దెలు చెల్లిస్తున్నా.. వసతులు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయి.
* తణుకు పట్టణంలో వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఒక్కో గృహంలో 50 వంద మంది విద్యార్థులున్నారు. దశాబ్దాల కిందట నిర్మించిన భవనాలు నేడు శిథిల దిశకు చేరుకున్నాయి. నీ పట్టణ శివారు ఇరగవరం కాలనీలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ బాలికలు, కళాశాల వసతి గృహాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం కురిస్తే భవనాలు నీరు కారుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.
వేలల్లో అద్దెలు..
బీసీ సంక్షేమ వసతి గృహ భవనానికి (నెలకు) రూ. 32 వేలు, ఎస్సీ వసతి గృహానికి రూ. 49 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. వీటిల్లో 50 నుంచి వంద మంది విద్యార్థులు చదువుతున్నారు. బీసీ వసతి గృహంలో తాగునీటిని ఫిల్టర్ చేసే యంత్రం మరమ్మతుకు గురైంది. దీంతో విద్యార్థులు ప్రైవేటు కేంద్రాల నుంచి నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.
మెరుగైన వసతుల కల్పనకు కృషి
జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతి గృహాలు 29 ఉండగా వాటిలో 17 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిలో 1298 మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ వసతి గృహాలకు సంబంధించి డైట్ బిల్లులు, కాస్మోటిక్ బిల్లులు గడిచిన డిసెంబరు వరకు విడుదలయ్యాయి.
వసతి గృహాల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తాం అని వెనుకబడిన తరగతుల వసతి గృహాల జిల్లా అధికారి గణపతిరావు తెలిపారు.
* తణుకు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం దుస్థితి ఇది. ఇక్కడ 37 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ తాగేందుకు సురక్షిత తాగునీరు కూడా కరవైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్: వైఎస్ షర్మిల
[ 26-04-2024]
రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన
[ 26-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు. -
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక