కోడేరు ఇసుక రీచ్పై దాడులు
అక్రమాలకు అడ్డాగా మారిన ఆచంట మండలం కోడేరు ఇసుక రీచ్పై గురువారం రాత్రి అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
మూడు పొక్లెయిన్లు, నాలుగు వాహనాల స్వాధీనం
పరారైన జేపీ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు
స్వాధీనం చేసుకున్న వాహనాలు
ఆచంట, న్యూస్టుడే: అక్రమాలకు అడ్డాగా మారిన ఆచంట మండలం కోడేరు ఇసుక రీచ్పై గురువారం రాత్రి అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నరసాపురం సబ్కలెక్టరు సూర్యతేజ ఆదేశాలతో ఇన్ఛార్జి తహశీల్దారు ఆర్.రాజ్యలక్ష్మి, ఎంపీడీవో జగన్నాథరావు, పెనుగొండ ఎస్సై సురేంద్రకుమార్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది సిబ్బంది ఏకకాలంలో ఈ దాడుల్లో పాల్గొన్నారు. మూడు పొక్లెయిన్లు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జేపీ సిబ్బందితో పాటు రీచ్ నిర్వహణ చూస్తున్న అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బిల్లులు సైతం లేకుండా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వైనంపై ‘గోదారి గర్భంలో తోడేస్తున్నారు’ శీర్షికతో జనవరి 31న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. బుధవారం ఇన్ఛార్జి తహశీల్దారు ఆర్.రాజ్యలక్ష్మి తన సిబ్బందితో వెళ్లి రీచ్లో తవ్వకాలను పరిశీలించారు. రాత్రి సమయంలో తవ్వకాలకు సంబంధించిన అనుమతి పత్రాలు, పర్యావరణ అనుమతులు చూపించాలని కోరడంతో రీచ్ నిర్వాహకులు ఒకరోజు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నదిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలు, రాత్రి సమయంలో రవాణా తదితర అంశాలను ఇన్ఛార్జి తహశీల్దారు సబ్కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాలతో దాడులు చేసి రీచ్ను సీజ్ చేశారు.
కౌంటర్ వదిలి పరారైన జేపీ సిబ్బంది
అనుమతులు లేకుండానే...
పర్యావరణ అనుమతులతో పాటు తవ్వకాలకు సంబంధించిన అనుమతులు గత ఏడాది జూన్ నెలతోనే ముగిసినట్లు తెలుస్తోంది. కానీ వరదల అనంతరం నవంబరులో బాటలు ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టేశారు. ఈ వ్యవహారం మైనింగ్ శాఖకు తెలిసినా అధికార పార్టీ నేతల సిఫార్సులతో పట్టించుకోలేదు. మరోపక్క రాత్రి సమయంలో తవ్వకాలకు సంబంధించి ఈ రీచ్కు ఎటువంటి అనుమతులు లేవు. అయినా అన్ని అనుమతులు ఉన్నట్లు దర్జాగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. సమీప అపరకర్మల భవనాన్ని సైతం స్వాధీనం చేసుకుని కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
నిర్వాహకులను అరెస్టు చేయాలి
ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న అధికార పార్టీకి చెందిన నిర్వాహకులపై కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని కోడేరు గ్రామానికి చెందిన పలువురు అధికారులను కోరారు. నేతల ఒత్తిడికి గురై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడిన జేపీ సిబ్బందితోపాటు నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తామని ఇన్ఛార్జి తహశీల్దారు ఆర్.రాజ్యలక్ష్మి ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్: వైఎస్ షర్మిల
[ 26-04-2024]
రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన
[ 26-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు. -
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్