సొంతింట్లో ఉగాది లేనట్లే!
పాలకొల్లుకు చెందిన టిడ్కో ఇంటి లబ్ధిదారు ఎ.సత్యవతి 26వ వార్డులో అద్దెకు ఉంటున్నారు. దాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్తే తిన్నా తినకపోయినా గడిచిపోతుందని భావించారు.
ఏళ్లవుతున్నా పూర్తికానిటిడ్కో గృహాలు
పాలకొల్లు, న్యూస్టుడే
పాలకొల్లులో పూర్తికాని ఇళ్లు
పాలకొల్లుకు చెందిన టిడ్కో ఇంటి లబ్ధిదారు ఎ.సత్యవతి 26వ వార్డులో అద్దెకు ఉంటున్నారు. దాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్తే తిన్నా తినకపోయినా గడిచిపోతుందని భావించారు. మూడేళ్లుగా అదిగో ఇదిగో అని చెప్పడం మినహా నేటికీ సొంతింటి యోగం కలగలేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఒక్క సత్యవతే కాదు పట్టణంలో రూ.వేలకు వేలు అద్దె చెల్లించి పరాయి పంచన ఉంటున్న అనేక మంది లబ్ధిదారుల వ్యధ ఇది.
ఉమ్మడి జిల్లాలోని టిడ్కో సముదాయాల్లో నిర్మాణాల ప్రగతిని పరిశీలిస్తే సొంతింట్లో ఉగాది పచ్చడి తినేది ఎన్నేళ్లకో అన్నట్లు కనిపిస్తోంది. గడిచిన మూడు నెలలుగా పరిశీలిస్తే వందకు వంద శాతం పూర్తయిన ఇళ్లు స్పల్పమేని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు పూర్తవగా.. ఈ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా మిగిలిన పనులు పూర్తిచేయకపోవడం లబ్ధిదారులకు శాపంగా మారింది. మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాల్లో మొదటి విడతలో, జంగారెడ్డిగూడెంలో రెండో విడతలో చేపట్టిన ఈ బహుళ అంతస్తుల్లో గృహయోగం కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు.
గోడలు, పైపుల నుంచి లీకులు ఇలా
నాణ్యత లేని పైపులతో..
గృహ ప్రవేశం చేయని వారి ఆవేదన ఒకలా ఉంటే.. ఇళ్లలోకి వెళ్లిన వారి ఆందోళన మరోలా ఉంది. గృహాలకు నీటిని సరఫరా చేసే పైపుల నాణ్యతలోని డొల్లతనం బయటపడుతోంది. ట్యాంకుల నుంచి మరుగుదొడ్లలోకి నీరొస్తున్నప్పుడు పైపులు లీకవుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ కారణంగా శ్లాబ్ గోడల నుంచి నీరు కారుతూ విద్యుత్తు బోర్డుల్లోకి చేరుతోందని చెబుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత సిబ్బందికి తెలియజేస్తే మక్కు పెట్టి రంగు వేశారని.. అది కూడా నిరుపయోగంగా మారిందని సత్యనారాయణ అనే లబ్ధిదారు వాపోయారు.
మరమ్మతులు చేయిస్తాం
వందలాది ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నప్పుడు ప్లంబింగ్ పనుల్లో చిన్న చిన్న లీకులు వస్తుంటాయి. స్థానికంగా ఉన్న ఏఈలను కలిస్తే మరమ్మతులు చేయిస్తారు. గణాంకాల పరంగా ప్రగతి కనిపించకపోవడానికి వంద శాతం పూర్తయిన ఇళ్లను మాత్రమే లెక్కల్లోకి తీసుకోవడమే కారణం. జంగారెడ్డిగూడెం పట్టణం రెండో విడతలో ఉన్నందున అక్కడ త్వరలో పనులు ప్రారంభమవుతాయి. మొదటి విడతలో ఇళ్లన్నీ పూర్తిచేసి రెండో విడతకు వెళ్తే బాగుంటుందనేది ఆలోచన.
స్వామినాయుడు, ఈఈ, టిడ్కో గృహ సముదాయాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మేమేం చేశాం పాపం?
[ 04-05-2024]
జగన్ సర్కారు అక్కసుతో పింఛనుదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అగ్నిగుండంలాంటి ఎండలో పింఛను కోసం వారు పడిన వేదన వర్ణనాతీతం. -
మీ గెండెల్లో ధైర్యం నింపడానికి వచ్చా
[ 04-05-2024]
కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాయంతో కృషి చేస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం కైకలూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. -
ఎగవేత.. లేదంటే కోత
[ 04-05-2024]
రైతే రాజన్నది నానుడి. అయిదేళ్ల కాలంలో జగనన్న వారినీ వదల్లేదు. తన మార్కు చర్యలతో కర్షకులను అన్ని విధాలా కష్టపెట్టారు. అయితే వ్యవసాయ రాయితీల ఎగవేత.. లేదంటే కోతలతో అన్నదాతలకు నష్టాలను మూట కట్టారు. -
హక్కు చట్టంతో.. ఆస్తులకు కాళ్లొస్తాయ్!
[ 04-05-2024]
దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా... ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. -
జగన్ సిద్ధం.. జనానికి నరకం
[ 04-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి శుక్రవారం నరసాపురంలో నిర్వహించిన సిద్ధం సభ.. జనానికి నరకం చూపింది. -
వైకాపా తెచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్’ అమలైతే సామాన్యులకు తీవ్ర నష్టం
[ 04-05-2024]
భూ హక్కు(ల్యాండ్ టైటిలింగ్) పేరిట వైకాపా సర్కారు తెచ్చిన చట్టం అమలులోకి వస్తే సొంత భూములపై హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ రమణరావు స్పష్టం చేశారు. -
పథకాల ఊకదంపుడే.. ప్రగతి ఊసేలేదు
[ 04-05-2024]
ఇరవై నిమిషాల ప్రసంగంలో జిల్లా ప్రగతి గురించి.. అయిదేళ్లలో చేసిన అభివృద్ధిపై..ఒక్క మాట కూడా మాట్లాడలేదు. -
నేడు నూజివీడులో చంద్రబాబు సభ
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నూజివీడులో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించే సభకు ఏర్పాట్లు చేశారు. -
నిర్వాసితుల్ని ఆదుకుంటాం
[ 04-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నియోజకవర్గాన్ని చిర్రి బాలరాజుతో కలిసి అభివృద్ధి చేస్తామని ఎన్డీయే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. -
తపాలా ఓటు వేయనిస్తారా.. లేదా?
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తపాలా బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. -
కల్యాణం.. రమణీయం
[ 04-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. -
వాటా ఇవ్వరు..జమ చేయరు!
[ 04-05-2024]
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి ఇచ్చి.... అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు. -
కూటమి ప్రభంజనం తథ్యం
[ 04-05-2024]
వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం తథ్యమని ఉండి శాసనసభ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కార్మికులకు భరోసా
[ 04-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. -
బాలుడి అనుమానాస్పద మృత
[ 04-05-2024]
ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం నూజివీడులో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM