logo

వైకాపా ఆటలు సాగవు :భాజపా

రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని..

Published : 28 Mar 2024 04:28 IST

ఆకివీడులో ప్రజలకు అభివాదం చేస్తున్న శ్రీనివాసవర్మ

భీమవరం పట్టణం, ఆకివీడు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. ఇకపై ఆ పార్టీ ఆటలు సాగవని భాజపా నరసాపురం పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన ఆయన భీమవరంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  అంతకు ముందు ఆకివీడు మండలం దుంపగడపలోని ఉప్పుటేరు వంతెన మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన ఆయనకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆ ప్రాంతంలో ఉన్న రామాలయంలో పూజలు చేసిన అనంతరం  ఊరేగింపుగా భీమవరంలో పార్టీ కార్యాలయానికి చేరుకుని కమలం గుర్తును హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. కూటమి పార్టీ నాయకులతో కలిసికట్టుగా ముందుకెళ్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని