రామరాజ్యం.. జనుల భాగ్యం
యుగాలు గడిచినా సుస్థిర పాలనకు పెట్టింది పేరు శ్రీరామరాజ్యం. కరవు ఛాయలు లేకుండా అకాల మరణాలు రాకుండా జనులంతా సుఖసంతోషాలతో జీవించేలా శ్రీరాముని పాలన కొనసాగేది.
సమర్థ పాలనకు ఓటే పరిష్కారం
నేడు శ్రీరామనవమి
యలమంచిలి, న్యూస్టుడే: యుగాలు గడిచినా సుస్థిర పాలనకు పెట్టింది పేరు శ్రీరామరాజ్యం. కరవు ఛాయలు లేకుండా అకాల మరణాలు రాకుండా జనులంతా సుఖసంతోషాలతో జీవించేలా శ్రీరాముని పాలన కొనసాగేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న అరాచకాలు, అక్రమాలను తిప్పికొట్టాలంటే రాముడి లక్షణాలున్న ఉత్తమ నాయకులను రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. పీడిత పాలన నుంచి బయటపడి ప్రజారంజక పాలన తెచ్చుకునే సదావకాశం మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరుకు వచ్చింది. ఓటును రామబాణంగా భావించి స్వార్థపరుల పాలనకు తెరదించడానికి నేటి శ్రీరామనవమి నుంచి సరిగ్గా 25 రోజుల సమయం ఉంది.
రాక్షస దోపిడీ..
రాక్షసుల నుంచి మునులను జనులను రాముడు రక్షించేవాడు. అయిదేళ్లలో దోపిడీదారులే ప్రజల పాలిట రాక్షసులయ్యారు. ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక, మట్టి, కంకరవంటి ప్రకృతి వనరులను కొల్లగొట్టి ఎక్కడికక్కడ జేబులు నింపేసుకున్నారు. కాల్వగట్లు, నదీగర్భాలను సైతం వదలకుండా తూట్లు పొడిచారు. వనరులను కొల్లగొట్టడం కాకుండా వనరులను కాపాడటం సృష్టించడం శ్రీరామ ధర్మం. అటువంటి ధర్మాత్ములకు ఓటర్లంతా మద్దతివ్వాల్సి ఉంది.
మాటంటే ప్రాణం...
ఓట్లు కొల్లగొట్టేందుకు ఏవిబడితే అవి హామిలిచ్చి అవసరం తీరాక పట్టించుకోని కొందరు పాలకులను ఉమ్మడి జిల్లాలో చూశాం. ఉదాహరణకు భీమవరంలో వంతెనలు కట్టిస్తామని, నరసాపురం ప్రాంతానికి ఫిషింగ్ హార్బర్ తెస్తామని, దగ్గులూరులో వైద్య కళాశాల నిర్మిస్తామని నేతలు మాటిచ్చి నిలుపుకోలేకపోయారు. రామరాజ్యంలో మాటంటే ప్రాణంతో సమానం. మాట తప్పని నాయకులకు ఈసారి ఓట్లాభిషేకం చేయడం ఓటర్ల బాధ్యత.
ఆకాంక్షలకు అనుగుణంగా...
పాలన ప్రజారంజకంగా ఉండేలా రాముడి ప్రణాళిక ఉండేది. ఇటీవల కాలంలో ప్రతిపనికీ మామూళ్లు వసూళ్లు చేసే నేతలు ఉమ్మడి జిల్లాలో తారసపడ్డారు. స్వార్థం కోసం అధికారాన్ని వినియోగించేవారు అక్రమ కేసులు బనాయించేవారు అత్యధికంగా పరిపాలనకు వచ్చారు. వ్యక్తిగత ప్రణాళిక తప్ప ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునేవారు కరవయ్యారు. స్వలాభం కోసం పదవులను అడ్డుపెట్టుకునేవారు కాకుండా ప్రజల బాగోగులే ఎజెండాగా ఉండే నాయకులకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించేలా ఈసారి ఎన్నికల్లో ఏకపక్ష నిర్ణయం వెలువడాలి. ఉభయ జిల్లాల్లోని 14 నియోజకవర్గాల పేర్లు వేర్వేరైనా ప్రజాక్షేమం, సంక్షేమంలో అయోధ్యకు మారుపేరుగా నిలవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ఇవా మెరున వైద్య సేవలు?
[ 30-04-2024]
ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యం రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ సీఎం జగన్ బోధనాసుపత్రి ఏర్పాటు చేశారు కానీ సేవల గురించి పట్టించుకోకుండా వదిలేశారు. -
జనసేన అభ్యర్థులు లేనిచోట్ల గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలను సోమవారం విడుదల చేశారు. వీటిలో జనసేన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. -
మనవడిని కొట్టిందని..కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
ప్రజల ఆస్తుల స్వాహాకు జగన్ కుట్ర
[ 30-04-2024]
ప్రజల ఆస్తులను స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అభివృద్ధి కావాలా.. జూద శిబిరాలు కావాలా
[ 30-04-2024]
సోమవారం సాయంత్రం 5.45 గంటలకు పవన్ గణపవరం మహాలక్ష్మి థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడికి భారీగా చేరుకున్న నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. -
యంత్రాంగం ఉండీ.. ఎందుకీ మంత్రాంగం?
[ 30-04-2024]
ఇంటింటి పింఛన్ల పంపిణీపై వైకాపా మరో కొత్త కుట్రకు శ్రీకారం చుట్టింది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడింది. మే నెల పింఛన్లు బ్యాంకులో వేస్తామంటూ కొత్తగా జగన్నాటకం మొదలు పెట్టింది. -
నూజివీడు కూటమిలో జోష్
[ 30-04-2024]
నూజివీడులో కూటమికి మరింత జోష్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. -
నిర్వాసితులను నిలువునా ముంచారు
[ 30-04-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదవీ కాలం ముగుస్తున్నా కనీసం ఒక్క ఎకరానికి కూడా పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. -
ఎన్నికల బరిలో 99 మంది
[ 30-04-2024]
జిల్లాలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 99 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నామపత్రాలను ఉపసంహరించుకునే ఘట్టం సోమవారం ముగిసింది. -
ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులు వీరే
[ 30-04-2024]
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. -
సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని వేధిస్తారా?
[ 30-04-2024]
కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆయన కుమారుడి అకృత్యాలు పెరిగిపోతున్నాయని, అక్రమ కేసులు బనాయించి కూటమి శ్రేణులను ఇబ్బంది పెడితే సహించనని కూటమి కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. -
ఆగని ఇసుక దందా
[ 30-04-2024]
ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సోమవారం కూడా ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరిగాయి. ఆదివారం గ్రామస్థులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిచింది. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై