logo

చిరుత పులి మృతి

రాజంపేట మండలం అనంతసముద్రం బీటు పరిధిలో ఏడేళ్ల వయసున్న చిరుతపులి శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసలు శనివారం తెలిపారు.

Published : 05 Feb 2023 02:22 IST

మృతి చెందిన చిరుత పులి

రాజంపేట గ్రామీణ న్యూస్‌టుడే: రాజంపేట మండలం అనంతసముద్రం బీటు పరిధిలో ఏడేళ్ల వయసున్న చిరుతపులి శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసలు శనివారం తెలిపారు. రెండు రోజుల కిందట అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో కొంత భాగం అడవి కాలిపోయిందని, ఆ సమయంలో చిరుత మంటలు నుంచి బయటపడే ప్రయత్నంలో మంటల్లో చిక్కుకుని కొంత భాగం కాలిపోయిందని, గాయాలతో అటవీ అధికారులు అడవి చుట్టూ తీసిన లోతైన కాలువలో పడిపోవడంతో మృతిచెందినట్లు గుర్తించామన్నారు. అటవీ, పశువైద్యాధికారుల సమక్షంలో పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని