logo

వైభవంగా జ్యోతుల ఉత్సవాలు

నీరుగట్టువారిపల్లెలో చౌడేశ్వరి ఆలయంలో జ్యోతుల ఉత్సవాలు మంగళవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి దీపాలతో కూడిన జ్యోతులను పురవీధుల్లో ప్రదర్శించారు.

Published : 22 Mar 2023 01:48 IST

నారుగట్టువారిపల్లెకు పోటెత్తిన భక్తులు

అలంకరణలో చౌడేశ్వరి అమ్మవారు... జ్యోతులతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు

నీరుగట్టువారిపల్లెలో చౌడేశ్వరి ఆలయంలో జ్యోతుల ఉత్సవాలు మంగళవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి దీపాలతో కూడిన జ్యోతులను పురవీధుల్లో ప్రదర్శించారు. అర్చకులు సేతుస్వామి అమ్మవారిని రజతంతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి హారతి పట్టారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఉగాది పర్వదినం బుధవారం తొగటి వీర క్షత్రియులు జ్యోతులను తయారు చేసి అమ్మ వారికి సమర్పించనున్నారు.

నీరుగట్టువారిపల్లె (మదనపల్లె అర్బన్‌), న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని