రూ.10 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ఖనిజావృద్ధి సంస్థలను విస్తరింపజేయడం ద్వారా ఏడాదికి రూ.10 వేల కోట్లు ఆదాయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు.
మంగంపేట ముగ్గురాయికి మంచి గిరాకీ : ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి
మాట్లాడుతున్న ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి
ఓబులవారిపల్లె, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ ఖనిజావృద్ధి సంస్థలను విస్తరింపజేయడం ద్వారా ఏడాదికి రూ.10 వేల కోట్లు ఆదాయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. మంగంపేట ఏపీఎండీసీ అతిథిగృహంలో బుధవారం ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో మంగంపేట ముగ్గురాయికి మంచి గిరాకీ ఉందని, గతేడాది మూడు మిలియన్ టన్నుల ఖనిజం విక్రయించడం ద్వారా రూ.1,200 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది 5 మిలియన్ టన్నుల ఖనిజాన్ని వెలికి తీస్తామని, మరో ఆరేళ్లల్లో ఖనిజ తవ్వకం పనులు పూర్తవుతాయని వివరించారు. సంస్థకు వస్తున్న ఆదాయంలో ఏడాదికి రూ.20 కోట్లు సీఎస్ఆర్ కింద ఖర్చు చేస్తున్నామని, ఏపీఎండీసీ పాఠశాలలో వచ్చే ఏడాది నుంచి ఉచిత భోజనం వసతి అమలు చేస్తామని తెలిపారు. దీంతోపాటు 8వ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించడంతోపాటు పాఠశాలకు అవసరమైన అదనపు గదులు నిర్మించనున్నట్లు తెలిపారు. కాపుపల్లె, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాలను మే చివరి నాటికి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే ఆర్ఆర్-5 గ్రామంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంతోపాటు మంగంపేట గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. ఆయనవెంట అధికారులు డి.వి.రమణ, బెనర్జీ, చలపతి, రమణ, తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
[ 07-05-2024]
రాజంపేట పార్టమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం అమల్లో ఉందని మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ఇక్కడ జరిగే దోపిడీలు, దౌర్జన్యాలు, వైకాపా నాయకుల పాపాలకు ఆ పెద్దిరెడ్డే కారకుడని ఆరోపించారు. -
సీఎం జగన్ కంచుకోటలో ఎందుకీ కలవరం?
[ 07-05-2024]
సీఎం జగన్కే కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట. ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. -
రాజోలి అన్నావ్.. జోలాలి పాడావ్!
[ 07-05-2024]
మాట తప్పను..మడమ తిప్పను అని సీఎం జగన్ తరచూ అంటుంటారు. రాజోలి ఆనకట్ట విషయంలో ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు... రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీఎం జగన్ మన జిల్లా వాసే కదా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే అమలవుతుందని మొదట్లో ప్రజలు నమ్మారు. -
రాక్షస రాజ్యం!
[ 07-05-2024]
దుష్టులకు అవకాశమిస్తే ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారో ప్రత్యక్ష సాక్ష్యం ఈ నియోజకవర్గం. ఇక్కడ గత ఐదేళ్లుగా అరాచకం రాజ్యమేలుతోంది. తమ వ్యతిరేకులను రాచిరంపాన పెట్టే పెడపాలనతో వైకాపా నేతలు చెలరేగిపోతున్నారు. వైకాపా దత్తపుత్రులైన ఖాకీల పెద్ద మనుషులు నేతల అరాచకకాండకు నిర్లజ్జగా సహకరిస్తున్నారు. -
బోరుమంటున్న జగన్ హామీ!
[ 07-05-2024]
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయడంతో పాటు, మోటారు, పైపులు, విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేయిస్తామని సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. -
150 స్థానాల్లో కూటమి విజయం ఖాయం
[ 07-05-2024]
ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కూటమి 150 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయమని, ముస్లిం మైనార్టీలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వారి విజయానికి సహకరించాలని ఎమ్మెల్సీ, విశ్రాంత ఐజీ ఇక్బాల్ పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలట్లో గందరగోళం!
[ 07-05-2024]
జిల్లాలో రెండో రోజైన సోమవారం కూడా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాలకు అధికారులు పంపిన ఓటర్ల జాబితాలో చాలా మంది ఉద్యోగుల పేర్లు లేకపోవడం, -
రెండో రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలట్ పోలింగ్
[ 07-05-2024]
జిల్లాలో రెండోరోజు సోమవారం పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 934 మంది ఉద్యోగులకు గాను 511 మంది ఓటేశారు. -
జగన్ హామీలు... నీటిపై రాతలు
[ 07-05-2024]
జిల్లాలో వైకాపాకు పులివెందుల తర్వాత బద్వేలు నియోజక వర్గంలోనే అత్యధికంగా ఆదరిస్తారు. అందులో అట్లూరు మండలం మరింత ఎక్కువని ఎమ్మెల్యే సుధ పలు కార్యక్రమాల్లో ప్రస్తావించారు. -
పోస్టల్ బ్యాలట్కు అధికార పార్టీ నగదు బదిలీ
[ 07-05-2024]
నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సోమవారం జరిగిన పోలింగ్లో 867 ఓటర్లకు 701 మంది హాజరయ్యారు. ఓటు వేసేందుకు వచ్చిన కొందరు అధికారులు ఎన్నికల విధులకు సంబంధించి ప్రోసీడింగ్ కాపీలు తీసుకు రాకపోవడంతో వెనక్కి పంపారు. -
వైకాపాను గెలిపిస్తే అభివృద్ధి పాతాళానికే!
[ 07-05-2024]
వైకాపాను మళ్లీ గెలిపించుకుంటే మదనపల్లె నియోజకవర్గం 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్కుమార్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర