logo

Kadapa: కడప ఎస్పీని కలిసిన వైఎస్‌ వివేకా కుమార్తె, అల్లుడు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి శనివారం కడప ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ని కలిశారు.

Published : 04 Nov 2023 16:59 IST

కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి శనివారం కడప ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ని కలిశారు. నూతన ఎస్పీగా సిద్దార్థ కౌశల్‌ బాధ్యతలు చేపట్టడంతో సునీత దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి పూర్వాపరాలు, తాజా పరిణామాలపై సునీత.. ఎస్పీకి వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం వివేకా హత్యకేసు విచారణ సీబీఐ కోర్టులో జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు, తమకు అవసరమైన భద్రత, ప్రధాన సాక్షిగా ఉన్న దస్తగిరి అంశంపై చర్చించినట్టు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని