సీఎం ఇలాకా.... కుర్చీలు ఖాళీగా!
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ...
అభాసుపాలైన అధికార వైకాపా నాయకులు
వచ్చిన కాస్త జనం వెంటనే తిరుగు ప్రయాణం
జగన్ ప్రసంగానికి ముందే బస్సులు తిరుగుటపా
సభలో జగన్ మాట్లాడుతుండగా జనం వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలిలా..
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర... అందులోనూ ప్రారంభం అదిరేపోయేలా ఉండాలనుకున్న వైకాపా నేతలు... సీఎం ఇలాకాలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగే యాత్రలో ప్రత్యేకించి ప్రొద్దుటూరులో కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి జనసమీకరణ... ఇందుకోసం రాయలసీమలోని అన్ని డిపోల నుంచి వందలాది బస్సుల తరలింపు... నిధులు మంచినీళ్లుగా ఖర్చు చేసి చేపట్టిన భారీ ఏర్పాట్లు.... ఇంత చేసినా ప్రొద్దుటూరు పట్టణంలో బుధవారం నిర్వహించిన తొలి బహిరంగ సభ పేలవంగానే సాగింది.
ఈనాడు, కడప, వేంపల్లె,ప్రొద్దుటూరు బృందం, దువ్వూరు
ఆర్టీసీ బస్సు వెనుక వైపు మద్యం తాగుతూ...
జమ్మలమడుగు- ప్రొద్దుటూరు రహదారిని ఆక్రమించుకుని సభాప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. వేదిక ముందు భాగంలో ప్రత్యక్ష ప్రసారానికి అనువుగా ఎన్నో తెలివితేటలతో జనాన్ని ఓహో అనేలా చూపించే ఎత్తుగడలు. సభకు మధ్య భాగంలో సీఎం ర్యాంప్ వాక్కు అనువుగా ఏర్పాట్లు. అన్నీ బాగానే ఉన్నా వచ్చిన కాస్త జనం కూడా కొద్దిసేపటికే వెనుదిరిగారు. సాయంత్రం 6.25 గంటలకు సభా ప్రాంగణంలోకి జగన్ బస్సు చేరింది. బస్సు ముందు భాగంలో కూర్చున్న ఆయన చేతులూపుతూ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కనీసం పక్కనున్న అద్దం కూడా దించకుండా.. బస్సు చుట్టూ భారీ భద్రత మధ్య సీఎం యాత్ర సాగింది. సీఎం వచ్చే సమయానికి సభా ప్రాంగణం సగం వరకు ఖాళీగా కనిపించింది. అప్పటికే వందలాది బస్సుల్లో దాదాపు సగం తిరుగు ప్రయాణమయ్యాయి. ఇలా వెళ్లే ప్రయత్నం చేసిన చెన్నూరు బస్సును కొందరు అడ్డుకోగా అందులోని కూలీలు వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని సాయంత్రం ఐదింటి వరకు రూ.200 కూలీతో తీసుకొచ్చారు. రాత్రికి భోజనం ఎవరు పెడతారు.?అని గొడవకు దిగారు. బస్సులు కదలకపోయినా వాటిల్లో చాలామంది కూర్చున్నారు. ఇలా సభ ప్రారంభానికి ముందే బస్సులను తీసుకుని చాలా మంది వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రాచమల్లు శిపప్రసాద్రెడ్డి పరిస్థితిని గమనించి పొడిపొడిగానే తన ప్రసంగాన్ని ముగించారు. ఆపై ఎంపీ అవినాష్రెడ్డి క్లుప్తంగానే మాట్లాడి సీఎం ప్రసంగం వెంటనే ప్రారంభించడానికి ప్రయత్నించారు. అప్పటికే సభ నుంచి జనం వెనక్కి తిరిగి వెళ్లడం కనిపించింది. సీఎం సైతం వేగంగా త్వరగా ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నించారు. ప్రొద్దుటూరులో సభ నిర్వహించగా. నియోజకవర్గం నుంచి పెద్దగా జనం రాలేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే సభలో కనిపించారు. తిరుమల డిపో బస్సులను సైతం సభకు మళ్లించారు. వందలాది బస్సులను జనం కోసం కేటాయించగా, చాలావరకు సగం సీట్లు వరకే జనం ఉన్నారు. కడపలో చాలా బస్సులు జనం రాకపోవడంతో ప్రొద్దుటూరు రాకనే సాయంత్రం వరకు ఉండి తిరిగి వెళ్లిపోయాయి. సీఎం సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉందేమిటని వైకాపా నేతలు గుసగుసలాడుకోవడం వినిపించింది. డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జనాన్ని తరలించే ప్రయత్నం చేసినా మహిళలు అంతంత మాత్రంగానే సభకు వచ్చారు. వాలంటీర్లు శతవిధాలా ప్రయత్నించి జనసమీకరణ చేపట్టినా ఫలితం లేక పోయింది.జగన్ బస్సుకు విద్యుత్తు తీగలు తగులుతాయనే ముందు జాగ్రత్తల్లో భాగంగా దువ్వూరులో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కరెంటు కోత పెట్టి జనాన్ని ఉక్కపోతకు గురిచేశారు. సభాస్థలిలో ఎక్కడ పడితే అక్కడ కొంతమంది మద్యం మత్తులో మునిగి పడిపోయారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసంగంతో సభలోని జనాలు ఇంటిదారి పట్టారు. చాలా గ్యాలరీలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన వారికి రూ.200 నుంచి రూ.500 వరకు నగదు, పురుషులకు బిర్యానీ పొట్లాలు, మద్యం సీసాలు పంపిణీ చేశారు.
సభాస్థలిలో మద్యం తాగి పడిపోయిన వ్యక్తి
జమ్మలమడుగులో జగన్ రోడ్ షో అనంతరం జనం పాట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 27-04-2024]
తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ తెలిపారు. -
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM