తాగునీటి గండం..విద్యార్థులకు శాపం
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది.
నాగాయపల్లె లోని కుందూ వద్ద గొట్టపు బావిలో అడుగంటిన జలం
దేశ సరిహద్దులో భద్రత ఏర్పాట్లు చూసే సైనికులు... పశువైద్య విజ్ఞానాన్ని అవపోశన పడుతున్న విద్యార్థులను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ సాధించిన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ప్రొద్దుటూరు మండలం.. గోపవరంలోని ప్రభుత్వ పశువైద్య కళాశాలలో నెలకొంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం పర్యవేక్షణలో వచ్చిన సాయుధ కేంద్ర బలగాలు ఈ కళాశాలకు సమీపంలో బస చేస్తున్నాయి. వీరికి ఇక్కడి సమీపంలోని కుందూ నది పరివాహనం నుంచే నీటి వనరులు చేరుతున్నాయి. గత కొంతకాలంగా అవసరం మేరకు నీరు విడుదల కాకపోవడంతో అగచాట్లకు గురవుతున్నారు. గతంలో అవసరానికి మించి అండుబాటులో ఉండే వనరులు నేడు అరకొరగా వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడమేనని అధికారులు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు.
తీవ్రరూపం దాల్చుతున్న వేసవి
రోజువారీగా లక్ష లీటర్లు నీరు అవసరం ఉంది. కానీ.. కొన్ని రోజులుగా అంతంతమాత్రంగా సరఫరా జరుగుతోంది. ఇందుకు నాగాయపల్లెలోని కుందూ పరివాహకం పక్కన 28 అడుగుల లోతులో ఉన్న రెండు గొట్టపు బావుల్లో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోవడమే కారణం. నది నుంచి 13 కి.మీ వరకు గొట్టపు మార్గాలు (పైప్లైన్) మీదుగా ప్రభుత్వ పశువైద్య కళాశాలకు నీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు. ఇక్కడ రెండు గొట్టపు బావుల నుంచి జలధార లేక నీటి ఎద్దడికి దారితీసింది. విద్యార్థుల వసతి గృహ సముదాయాలతో పాటు అధ్యాపకులు, సిబ్బందితో పాటు కళాశాల ప్రాంగణంలో సుమారు 200 పశుసంపదకు సంబంధించి మూగజీవాలకు అవసరమైన నీటి సరఫరా లేదు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మే నెలకు ముందే వేసవి తీవ్రరూపం దాల్చుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో 200 మంది పారా మిలటరీ దళాలు ప్రభుత్వ పశువైద్య కళాశాల ఆవరణంలోని సముదాయాల్లో ఉంటున్నారు. దీంతో నీటి కొరత లేకుండా పరిష్కరించాలని గ్రామీణ నీటి పథకం ఇంజినీర్లను పోలీసు అధికారులు కోరారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగభరత్రెడ్డిని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా తమ దృష్టికి సమస్య రాగానే స్థానిక రాజీవ్నగర్లో రిజర్వ్గా ఉన్న రెండు గొట్టపు బావుల నీటిని పశువైద్య కళాశాలకు చెందిన గొట్టానికి అనుసంధానం చేశామన్నారు. తాత్కాలికంగా సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాలు చేసిన వారిని తొక్కిపడేయండి: బ్రదర్ అనిల్
[ 28-04-2024]
పాపాలు చేసిన వారిని తొక్కిపడేయాలని వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. -
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 28-04-2024]
మండల కేంద్రంలో ఆదివారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
[ 28-04-2024]
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పేరు వింటేనే మనకు అరాచక పాలన గుర్తుకొస్తుంది. దీనిని తలదన్నేలా రాష్ట్రంలో జగన్ పాలన భయభ్రాంతులకు గురిచేస్తోంది.... అఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ఆటవిక పాలనను సైతం మరిపిస్తోంది. -
యువత మరణాలు వైకాపా ప్రభుత్వ హత్యలే!
[ 28-04-2024]
‘అయిదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్ను ఇంటికి పంపిస్తాం. యువత మరణాలన్నీ వైకాపా ప్రభుత్వ హత్యలే’ అని నిరుద్యోగ ఐకాస నాయకులు మండిపడ్డారు. -
ఎస్ఆర్బీసీ... తుంగలో తొక్కేసి..!
[ 28-04-2024]
సీఎం జగన్ సొంత జిల్లాలో సాగునీటి పనులకు మోక్షం కలగడంలేదు. ప్రధానంగా నిధుల్లేక నిలిచిపోయిన ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడికాలువ) పనులు ఏళ్లుగా పడకేశాయి. -
నా అనుకున్న వాళ్లే మోసం చేశారు
[ 28-04-2024]
అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె సునీతారెడ్డి పేర్కొన్నారు. -
పుంగనూరు, తంబళ్లపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
కూటమి జోష్!
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు రంగంలోకి దిగడం మరింత జోష్ నింపుతోంది. -
ఒట్టేసి ఒక మాట... ఓటేశాక ఒక మాట..!
[ 28-04-2024]
‘2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్...నేను ఉన్నా.. నేను విన్నా.. అని చెప్పి ఓట్లు అడిగి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. -
జగన్ ఝలక్... కరెంట్ షాక్!
[ 28-04-2024]
వైకాపా పాలనలో విద్యుత్తు నియంత్రికలు, సామగ్రికి ధరాఘాతం తప్పడం లేదు. అస్మదీయులకు ఆయాచితంగా లబ్ధి కలిగించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. -
జగన్ దంపతులొచ్చి ప్రచారం చేసినా గెలుపు నాదే
[ 28-04-2024]
ఈ నెల 25వ తేదీన నామినేషన్ తర్వాత తలపెట్టిన కూటమి ర్యాలీ విజయవంతమైనందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
తెదేపాలో చేరికలు... విజయానికి సంకేతాలు
[ 28-04-2024]
తెదేపాలోకి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు చేరిపోతున్నారు. తమ మద్దతు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు పలుకుతున్నారు. మైదుకూరు పట్టణంలో 15వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు బండి సుబ్బరాయుడు, బండి రాజాలు వారి అనుచరులతో శనివారం తెదేపాలో చేరారు. -
క్రీడా మైదానం...రాచమల్లుకు ఆదాయం
[ 28-04-2024]
ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతూ, క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడే ప్రొద్దుటూరు అనిబిసెంటు పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన కోహ్లీ, జాక్స్.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!