జగన్ దంపతులకు తెలియకుండా వివేకా హత్య జరిగి ఉండదు
సీఎం జగన్ దంపతులకు తెలియకుండా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండదని భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగు, న్యూస్టుడే: సీఎం జగన్ దంపతులకు తెలియకుండా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండదని భాజపా జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక భాజపా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆ రోజు తనపై నింద మోపారన్నారు. ఇటీవల కమలాపురంలో జరిగిన సమావేశంలో ఆ ఎమ్యెల్యే మాట్లాడుతూ హత్య చేసింది గంగిరెడ్డి అయితే అవినాష్రెడ్డి చూస్తూ ఉన్నారంటే తనకూ ఈ హత్యకు సంబంధం లేదనే కదా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చేయని తప్పే లేదని విమర్శించారు. ఆయన ప్రచారం పేరిట పల్లెలు తిరిగేది అక్కడున్న సహజ వనరులను దోచుకునేందుకు, భూ కబ్జాలకు పాల్పడేందుకేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలను గెలవ నుందన్నారు. తాను జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై మాట్లాడుతూ ఇప్పటికే కొంత మంది వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, సక్రమంగా ఉండక పోతే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో తెదేపా, కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని, రాజోలి జలాశయం నిర్వాసితులకు రూ.12.50 లక్షలకు బదులుగా రూ.24 లక్షలు పరిహారం ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యల తిష్ఠ... జగన్ పాలనకు పరాకాష్ట
[ 01-05-2024]
ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు. -
గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం
[ 01-05-2024]
గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. -
తొలగించని సీఎం స్టిక్కర్
[ 01-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులు అయినా స్థానిక ముద్దనూరులోని జెండా మాను వీధి, రైల్వే గేటు సమీపంలో, వాటర్ ట్యాంకు సమీపంలోని ఇళ్ల వద్ద గోడలపై ‘మా నమ్మకం నూవ్వే జగన్’ స్టిక్కర్లు ఇప్పటికి అలాగే ఉన్నాయి. -
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగురవేస్తాం
[ 01-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని, ఖచ్చితంగా గెలిచితీరుతామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
విభజన రాజకీయాలతో మైనార్టీల ఓట్లకు వైకాపా ఎసరు
[ 01-05-2024]
భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. -
అయిదేళ్ల వైకాపా పాలనంతా మోసం
[ 01-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రైతులు, యువత, అన్ని వర్గాలను జగన్ పూర్తిగా మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. -
ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పండి
[ 01-05-2024]
అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి అన్నారు. -
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీలేరు పట్టణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలను మంగళవారం ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు. -
అనిశా వలలో ట్రాన్స్కో జలగ!
[ 01-05-2024]
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర