గురువులే ప్రత్యక్ష దేవతలు
ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయికి చేరుకోవటంలో వారి కన్నవారితోపాటు ప్రత్యక్ష దేవతలైన గురువులే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. తాను చదువుకున్న ఏన్కూరులోని
వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు
ఏన్కూరులోని గురుకులంలో పర్యటిస్తున్న వైద్య, ఆరోగ్య సంచాలకులు
శ్రీనివాసరావు, ఐఆర్ఎస్ అధికారి లావుడ్యా జీవన్లాల్ తదితరులు
ఏన్కూరు, న్యూస్టుడే: ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయికి చేరుకోవటంలో వారి కన్నవారితోపాటు ప్రత్యక్ష దేవతలైన గురువులే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. తాను చదువుకున్న ఏన్కూరులోని తెలంగాణ గురుకులాన్ని ఐఆర్ఎస్ అధికారి జీవన్లాల్తో కలిసి శనివారం సందర్శించారు. మూడు గంటలపాటు పూర్వ విద్యార్థులతో కలిసి తిరుగుతూ 39 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే గురుకులంలో విద్యాభ్యాసమే పునాది అని గుర్తుచేశారు. అడవిలా ఉండే గురుకులంలో పురుగుల అన్నం తిని, విష పురుగులతో సహవాసం చేస్తూ కష్టపడి పదో తరగతి పూర్తి చేశామన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడాలనే సంకల్పంతో ఉండాలని, ఆటపాటలతో విద్యను కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. పాఠశాలలో తాను చేసిన చిలిపి చేష్టలు, టూరింగ్ టాకీస్ కబుర్లు చెబుతూ రెండు గంటలు అందరినీ నవ్వించారు. పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఐఆర్ఎస్ అధికారి, పూర్వ విద్యార్థి లావుడ్యా జీవన్లాల్ మాట్లాడుతూ గురుకులం తనకు దేవాలయం అని ఇక్కడ నేర్చుకున్న విద్య, క్రమశిక్షణ ఇప్పటివరకు తనను ముందుకు సాగేలా చేస్తుందన్నారు. ఇద్దరు అధికారులు పిల్లలతో ముఖాముఖి సంభాషణ చేశారు. పలు విభాగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులందించారు. సరస్వతి విగ్రహం వద్ద పూజలు చేశారు. పూర్వ విద్యార్థులు సాఫ్ట్వేర్ సంస్థ సీఈవో వడ్డే నరసింహారావు, గిరిబాబు, కృష్ణయ్య, నాగయ్య, ప్రధానాచార్యులు టి.శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
* ఏళ్ల తర్వాత చదువులమ్మ ఒడికి వచ్చిన ఆనందంతో తోటి స్నేహితులు, విద్యార్థులతో కలిసి గడల శ్రీనివాసరావు డీజే పాటలకు నృత్యం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస హయాంలోనే సమగ్రాభివృద్ధి
[ 30-04-2024]
కాంగ్రెస్, భాజపాకు ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనని.. గులాబీ జెండా ఒక్కటే ప్రజలకు అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
గిరిజనులకు అండ.. కాషాయ జెండా
[ 30-04-2024]
కాషాయ జెండా గిరిజనులకు అండగా నిలుస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సోమవారం నిర్వహించిన భాజపా జన సభలో ఆయన ప్రసంగించారు. -
స్వయం ప్రేరణతో పోలింగ్ మెరుగు
[ 30-04-2024]
తాజా లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో రెండు దశల పోలింగ్ ముగిసింది. చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో మునుపటి (2019) ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. -
త్రిముఖ వ్యూహం.. గెలుపే లక్ష్యం
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో పాగా వేయటమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, నియోజకవర్గాల వారీగా నాయకుల ప్రచారం కలిసొస్తుందని అంచనా వేస్తోంది. -
కాంగ్రెస్లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు
[ 30-04-2024]
ఖమ్మం నగరంలోని 38, 56వ డివిజన్ల భారాస కార్పొరేటర్లు ఆలియా, పైడిపల్లి రోహిణి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో సోమవారం చేరారు. -
అత్యధిక మెజార్టీ నామాదే!
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. -
కేంద్ర మంత్రి.. రెండుచోట్ల ఓటమి!
[ 30-04-2024]
టెలికమ్యూనికేషన్ల శాఖ కేంద్ర మంత్రిగా పని చేసిన పీవీ రంగయ్య నాయుడు 1996 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
లోక్సభ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో మిగిలిన 35 మంది అభ్యర్థులకు బ్యాలెట్ పత్రంలో వరుస క్రమం, ఎన్నికల గుర్తులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతమ్ కేటాయించారు. -
32 కిలోల గంజాయి స్వాధీనం
[ 30-04-2024]
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి మృతి
[ 30-04-2024]
అశ్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి సలిగంజి వెంకటేశ్వరరావు(54) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. -
ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్లో 23 మంది
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 35 మంది, మహబూబాబాద్ స్థానంలో 23 మంది బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా చోట్ల వరుసగా ఆరుగురు, ఇద్దరు అభ్యర్థులు తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. -
ముత్తంగి రూపంలో రాములోరి దర్శనం
[ 30-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతుడైన రామయ్యతండ్రి చూడముచ్చటగా కనిపించి మురిపించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి