గురువులే ప్రత్యక్ష దేవతలు
ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయికి చేరుకోవటంలో వారి కన్నవారితోపాటు ప్రత్యక్ష దేవతలైన గురువులే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. తాను చదువుకున్న ఏన్కూరులోని
వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు
ఏన్కూరులోని గురుకులంలో పర్యటిస్తున్న వైద్య, ఆరోగ్య సంచాలకులు
శ్రీనివాసరావు, ఐఆర్ఎస్ అధికారి లావుడ్యా జీవన్లాల్ తదితరులు
ఏన్కూరు, న్యూస్టుడే: ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయికి చేరుకోవటంలో వారి కన్నవారితోపాటు ప్రత్యక్ష దేవతలైన గురువులే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. తాను చదువుకున్న ఏన్కూరులోని తెలంగాణ గురుకులాన్ని ఐఆర్ఎస్ అధికారి జీవన్లాల్తో కలిసి శనివారం సందర్శించారు. మూడు గంటలపాటు పూర్వ విద్యార్థులతో కలిసి తిరుగుతూ 39 ఏళ్ల క్రితం జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే గురుకులంలో విద్యాభ్యాసమే పునాది అని గుర్తుచేశారు. అడవిలా ఉండే గురుకులంలో పురుగుల అన్నం తిని, విష పురుగులతో సహవాసం చేస్తూ కష్టపడి పదో తరగతి పూర్తి చేశామన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడాలనే సంకల్పంతో ఉండాలని, ఆటపాటలతో విద్యను కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. పాఠశాలలో తాను చేసిన చిలిపి చేష్టలు, టూరింగ్ టాకీస్ కబుర్లు చెబుతూ రెండు గంటలు అందరినీ నవ్వించారు. పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఐఆర్ఎస్ అధికారి, పూర్వ విద్యార్థి లావుడ్యా జీవన్లాల్ మాట్లాడుతూ గురుకులం తనకు దేవాలయం అని ఇక్కడ నేర్చుకున్న విద్య, క్రమశిక్షణ ఇప్పటివరకు తనను ముందుకు సాగేలా చేస్తుందన్నారు. ఇద్దరు అధికారులు పిల్లలతో ముఖాముఖి సంభాషణ చేశారు. పలు విభాగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులందించారు. సరస్వతి విగ్రహం వద్ద పూజలు చేశారు. పూర్వ విద్యార్థులు సాఫ్ట్వేర్ సంస్థ సీఈవో వడ్డే నరసింహారావు, గిరిబాబు, కృష్ణయ్య, నాగయ్య, ప్రధానాచార్యులు టి.శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
* ఏళ్ల తర్వాత చదువులమ్మ ఒడికి వచ్చిన ఆనందంతో తోటి స్నేహితులు, విద్యార్థులతో కలిసి గడల శ్రీనివాసరావు డీజే పాటలకు నృత్యం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నట్టేట ముంచే నకిలీలలు
[ 21-05-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాది సాగుకు సానుకూల వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన అన్నదాతలు ఈసారైనా కాలం కలిసొస్తుందన్న కోటి ఆశలతో ఉన్నారు. -
ఉప ఎన్నికల సమరం.. రసవత్తరం
[ 21-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. -
మాతృక.. గిరిపుత్రులకు బాసట..!
[ 21-05-2024]
రెవెన్యూ భూములు కాకుండా.. అటవీశాఖకు సంబంధం లేని మాతృక భూములను భూమిలేని అత్యంత నిరుపేద గిరిజనులకు పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. -
పాతాళానికి పరుగులు
[ 21-05-2024]
గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇటీవల మండే ఎండలకు జిల్లాలో భూగర్భ జలం పాతాళానికి పరుగులు తీస్తోంది. చెరువులు, కుంటల్లో నీటి జాడ లేక పూర్తిగా ఎండిపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టం పడిపోయింది. -
అర్హులందరికీ రేషన్ కార్డులు: పొంగులేటి
[ 21-05-2024]
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దు: కేటీఆర్
[ 21-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. -
పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ: తీన్మార్ మల్లన్న
[ 21-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి కాదుగదా అంతరిక్షం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి తీసుకొచ్చినా గెలవలేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. -
పట్టభద్రుల సమస్యలపై నిలదీసేందుకు భాజపాకు మద్దతివ్వాలి: ఈటల
[ 21-05-2024]
ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై చట్టసభల్లో నిలదీసేందుకు భాజపా అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ కోరారు. -
పునాది దశ దాటని వంతెన
[ 21-05-2024]
అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు. -
ఆదివాసీ సంప్రదాయం ‘చల్ల’గుండాలి
[ 21-05-2024]
వేసవి వచ్చిందంటే ఆదివాసీల వద్ద ఆనప(సొరకాయ) బుర్ర ఉండాల్సిందే. ఇది వారికి కదిలే ఫ్రిజ్. గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ కొద్ది రోజుల నుంచి ఆనప బుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు. -
ఎర్ర చీమల గుడ్లూ.. ఆదివాసీల ఆహారమే..!
[ 21-05-2024]
తెలంగాణ-ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు. -
ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
[ 21-05-2024]
ప్రజా ఉద్యమాలతోనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య అన్నారు. -
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోండి
[ 21-05-2024]
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. -
హత్య కేసు నిందితుల అరెస్టు
[ 21-05-2024]
ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రీకాల్, కోక్రియేట్ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పీసీలు
-
మళ్లీ మరచిపోయిన బైడెన్.. ఈసారి ‘వైస్ ప్రెసిడెంట్’
-
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ
-
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
-
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల
-
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్