చకచకా నిర్మాణం.. ప్రమాదాలు దూరం
జాతీయ రహదారిపై బైపాస్ వలయం.. రయ్మంటూ దూసుకొచ్చే వాహనాలు.. రెప్పపాటులో ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోవడం.. ఇలా నెలలో ఐదారు ప్రమాదాలు జరిగేవి.
న్యూస్టుడే, చేగుంట
ఆరు వరుసలుగా జాతీయ రహదారి నిర్మాణం
జాతీయ రహదారిపై బైపాస్ వలయం.. రయ్మంటూ దూసుకొచ్చే వాహనాలు.. రెప్పపాటులో ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోవడం.. ఇలా నెలలో ఐదారు ప్రమాదాలు జరిగేవి. ఇది 44వ జాతీయ రహదారిపై చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి బైపాస్ సర్కిల్ వద్ద పరిస్థితి. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అక్కడ ఉపరితల వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న అతిపొడవైన 44వ జాతీయ రహదారి జిల్లాలోని చేగుంట, తూప్రాన్ మీదుగా వెళ్తుంది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ దారిలో వేగంగా వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. స్పీడ్గన్లు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యమే. ముఖ్యంగా రెడ్డిపల్లి సర్కిల్ వద్ద ఘటనలు ఎక్కువగా జరుగుతుండేవి. ఇటు హైదరాబాద్, అటు నాగపూర్ నుంచి వచ్చే వాహనాలు సమీపంలోకి వచ్చే వరకు బైపాస్ సర్కిల్ కనిపించకుండా ఉండటంతో డ్రైవర్లు తికమకపడేవారు. ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం.
రూ.19 కోట్లతో..
రెడ్డిపల్లి వద్ద ప్రమాదాల నివారణకు ఉపరితల వంతెన నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.19 కోట్లు మంజూరు చేసింది. వీటితో గతేడాది నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. ఇరువైపులా మట్టి వేస్తూ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ ఆరు వరుసలుగా నిర్మిస్తున్నారు. మరో ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికతో సాగుతున్నారు.
తగ్గిన వంతెన ఎత్తు
వాస్తవానికి వంతెన ఎత్తు 18 అడుగులు ఉండాలి. ఇక్కడ మాత్రం 13 అడుగులు మాత్రమే ఉంది. అందులో నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగించడం కష్టంగా ఉంటుంది. కేవలం బస్సులు, లారీలు మాత్రమే వెళ్లేందుకు ఆస్కారం ఉంది. తూప్రాన్ మండలం నాగులపల్లి వద్ద వంతెన ఎత్తు 18 అడుగులు ఉంది. నాగపూర్ వైపు నుంచి చేగుంటకు భారీ వాహనాలు రావాలంటే కుదరదు. ఈ విషయమై స్థానికులు విన్నవిస్తున్నా ఎన్హెచ్ఏఐ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిజామాబాద్ నుంచి చేగుంటలోకి వాహనాలు మలుపు తిరిగే చోట సర్వీసు రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇలా కొన్ని సవరణలు చేస్తూ నిర్మాణం చేపడితే ప్రయాణం సాఫీగా సాగిపోనుంది. దీనిపై సంబంధిత అధికారులు దృష్టిసారించాలి.
చేగుంట వద్ద నిర్మిస్తున్న వంతెన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల