logo

కాలుజారి.. శవమై తేలి...

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో సోమవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన చెలిమెల

Published : 18 Jan 2022 02:25 IST

తూప్రాన్‌, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో సోమవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన చెలిమెల నగేశ్‌ (50) మేస్త్రీ పనితో పాటు వ్యవసాయం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం చెరువు సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకొని వస్తుండగా చెరువులో కాళ్లు చేతులు కడుక్కునేందుకు లోపలికి దిగగా ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. ఆదివారం సాయంత్రం వరకు నగేశ్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. సోమవారం చెరువు వద్ద చెప్పులు కనిపించడంతో అందులో వెతికేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే నగేశ్‌ మృతదేహం పైకి తేలి కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కొడుకు వెంకటేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని