అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు.
జగన్ను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
ఆలూరు సభలో చంద్రబాబు
ఇదిగో.. ఇదీ మీ పాలన
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. నాసిరకం మద్యంతో ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నో తప్పులు చేసి, మేం సిద్ధం అంటూ వస్తున్నారని.. అలాంటి వారిని భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.
ఈనాడు, కర్నూలు: సీఎం జగన్కు అధికారం నెత్తినెక్కి.. అహంకారంతో విర్రవీగుతున్నారని.. దోపిడీ, విధ్వంసంతో ప్రజల జీవితాల్ని నాశనం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజలందరూ తన బానిసలుగా ఉండాలన్నది ఆయన మనస్తత్వమని విమర్శించారు. ‘ఆయన ఒక్కరి దగ్గరే డబ్బులు ఉండాలి.. మిగిలిన అందరూ ఆయనకు ఊడిగం చేయాలి.. ఆయనది లెక్కలేని మనస్తత్వం. పెత్తందారీ స్వభావం. అయిదేళ్ల జగన్రెడ్డిది ఆటవిక పాలన. జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే బాగుపడ్డారు. ఆయన విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి వ్యక్తిని ప్రజలు భరించే పరిస్థితుల్లో లేరు. నిన్నటివరకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి మళ్లీ మీ నెత్తిన చేయిపెట్టడానికి రోడ్డు మీదికి వచ్చారు. జాగ్రత్తగా ఉండండి.’ అని హెచ్చరించారు.
సామాజిక న్యాయం చేస్తాం..
మాదిగ వర్గీకరణకు ఎన్డీఏ కూడా సానుకూలంగా ఉందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మాదాసి కురుబలను ఎస్సీల్లో చేరుస్తామని, వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశం తప్పకుండా పరిశీలిస్తామన్నారు. బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. అనంతపురం పార్లమెంటు టికెట్ బోయకు, కర్నూలు, హిందూపురం పార్లమెంటు టెకెట్లను కురుబలకు ఇచ్చామని, నాలుగు అసెంబ్లీ టికెట్లను బోయలకు ఇచ్చామని గుర్తుచేశారు. కూటమి తరఫున ఆదోనిలో పార్థసారథి, మంత్రాలయం టికెట్ రాఘవేంద్రరెడ్డికి, రాయదుర్గం టికెట్ కాలవ శ్రీనివాసులకు, గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరాంకు ఇచ్చామని గుర్తుచేశారు. సామాజిక న్యాయం చేయడం కోసమే ఆయా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జగన్మోహన్రెడ్డి సామాజిక ద్రోహం చేశారన్నారు. రాష్ట్రంలో సర్పంచులు తిరుగుబాటు చేయాలని ఫైనాన్స్ కమిషన్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని చంద్రబాబు ఆరోపించారు. ‘సర్పంచులకు నిధులు, విధులు కేటాయిస్తా. పనులన్నీ వారితో చేయిస్తాం. గ్రామాల్లో పెత్తనమంతా సర్పంచులది, స్థానిక సంస్థలదే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఏ పార్టీ సర్పంచైనా తెదేపాకు అనుకూలంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు సర్పంచులు తెదేపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు.
శవ రాజకీయాలు చేసే వ్యక్తి..
జగన్మోహన్రెడ్డి శవ రాజకీయాలు చేసే వ్యక్తని.. మొన్నటివరకు కోడికత్తి డ్రామా ఆడి ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఎవరైనా గులకరాయితో హత్యాయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. కన్నతల్లికి భారమైన వ్యక్తి జన్మభూమికి కూడా భారమేనని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి అవసరమా? అని ప్రశ్నించారు.
సత్తా ఎవరికి ఉంది?
అభివృద్ధి చేసే, పెట్టుబడులు తెచ్చే, ఉద్యోగాలిచ్చే, సుపరిపాలన చేసే సత్తా ఎవరికి ఉందని ప్రశ్నించగా, సభకు వచ్చిన వారందరూ ‘మీకే.. మీకే..’ అంటూ చంద్రబాబునాయుడుకు మద్దతు పలికారు. తెదేపా సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. వైకాపాది పోయే ప్రభుత్వమని.. వారిని నమ్ముకుని వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని, ఒత్తిడి తెస్తే ఎదురు తిరగాలని పేర్కొన్నారు. ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్రగౌడ్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు సామాన్య తెదేపా కార్యకర్తలని, వారిద్దరినీ గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నాగరాజు ప్రస్తుతం ఎంపీటీసీగా పనిచేస్తున్నారని, ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చామని గుర్తుచేశారు.
ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా?
ఈనాడు డిజిటల్, అనంతపురం: అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అవసరం కోసం మొసలి కన్నీరు కార్చడం సీఎం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని చంద్రబాబు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? పవన్ కల్యాణ్ను ఇష్టానుసారంగా తిడుతున్నారు. నా మీద నోరు పారేసుకుంటున్నారు. బూతులు తిట్టాలంటే ఒక్క నిమిషం పని. కానీ అభివృద్ధి చేయడం కష్టం.. కూల్చడం ఎంతసేపు? అకారణంగా ప్రజావేదికను కూల్చేశారు. జగన్ విధ్వంసం తప్ప ఏమీ చేయలేదు. అమరావతిని నాశనం చేశారు’ అని విమర్శించారు. ‘మందుబాబుల బలహీనతే జగన్ బలం. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ. 200 పలుకుతోంది. అయిదేళ్లలో రూ. లక్షల కోట్లు దోచుకున్నారు.పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. ధరలు పెంచి, పన్నులు వేసి, మీ డబ్బులు కొట్టేసి, మీ రక్తాన్ని తాగేసిన జలగ ఈ జగన్మోహన్రెడ్డి’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ