అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు.
జగన్ను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
ఆలూరు సభలో చంద్రబాబు
ఇదిగో.. ఇదీ మీ పాలన
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. నాసిరకం మద్యంతో ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నో తప్పులు చేసి, మేం సిద్ధం అంటూ వస్తున్నారని.. అలాంటి వారిని భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.
ఈనాడు, కర్నూలు: సీఎం జగన్కు అధికారం నెత్తినెక్కి.. అహంకారంతో విర్రవీగుతున్నారని.. దోపిడీ, విధ్వంసంతో ప్రజల జీవితాల్ని నాశనం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజలందరూ తన బానిసలుగా ఉండాలన్నది ఆయన మనస్తత్వమని విమర్శించారు. ‘ఆయన ఒక్కరి దగ్గరే డబ్బులు ఉండాలి.. మిగిలిన అందరూ ఆయనకు ఊడిగం చేయాలి.. ఆయనది లెక్కలేని మనస్తత్వం. పెత్తందారీ స్వభావం. అయిదేళ్ల జగన్రెడ్డిది ఆటవిక పాలన. జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే బాగుపడ్డారు. ఆయన విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి వ్యక్తిని ప్రజలు భరించే పరిస్థితుల్లో లేరు. నిన్నటివరకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి మళ్లీ మీ నెత్తిన చేయిపెట్టడానికి రోడ్డు మీదికి వచ్చారు. జాగ్రత్తగా ఉండండి.’ అని హెచ్చరించారు.
సామాజిక న్యాయం చేస్తాం..
మాదిగ వర్గీకరణకు ఎన్డీఏ కూడా సానుకూలంగా ఉందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మాదాసి కురుబలను ఎస్సీల్లో చేరుస్తామని, వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశం తప్పకుండా పరిశీలిస్తామన్నారు. బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. అనంతపురం పార్లమెంటు టికెట్ బోయకు, కర్నూలు, హిందూపురం పార్లమెంటు టెకెట్లను కురుబలకు ఇచ్చామని, నాలుగు అసెంబ్లీ టికెట్లను బోయలకు ఇచ్చామని గుర్తుచేశారు. కూటమి తరఫున ఆదోనిలో పార్థసారథి, మంత్రాలయం టికెట్ రాఘవేంద్రరెడ్డికి, రాయదుర్గం టికెట్ కాలవ శ్రీనివాసులకు, గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరాంకు ఇచ్చామని గుర్తుచేశారు. సామాజిక న్యాయం చేయడం కోసమే ఆయా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జగన్మోహన్రెడ్డి సామాజిక ద్రోహం చేశారన్నారు. రాష్ట్రంలో సర్పంచులు తిరుగుబాటు చేయాలని ఫైనాన్స్ కమిషన్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని చంద్రబాబు ఆరోపించారు. ‘సర్పంచులకు నిధులు, విధులు కేటాయిస్తా. పనులన్నీ వారితో చేయిస్తాం. గ్రామాల్లో పెత్తనమంతా సర్పంచులది, స్థానిక సంస్థలదే ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఏ పార్టీ సర్పంచైనా తెదేపాకు అనుకూలంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు సర్పంచులు తెదేపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు.
శవ రాజకీయాలు చేసే వ్యక్తి..
జగన్మోహన్రెడ్డి శవ రాజకీయాలు చేసే వ్యక్తని.. మొన్నటివరకు కోడికత్తి డ్రామా ఆడి ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఎవరైనా గులకరాయితో హత్యాయత్నం చేస్తారా అని ప్రశ్నించారు. కన్నతల్లికి భారమైన వ్యక్తి జన్మభూమికి కూడా భారమేనని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి అవసరమా? అని ప్రశ్నించారు.
సత్తా ఎవరికి ఉంది?
అభివృద్ధి చేసే, పెట్టుబడులు తెచ్చే, ఉద్యోగాలిచ్చే, సుపరిపాలన చేసే సత్తా ఎవరికి ఉందని ప్రశ్నించగా, సభకు వచ్చిన వారందరూ ‘మీకే.. మీకే..’ అంటూ చంద్రబాబునాయుడుకు మద్దతు పలికారు. తెదేపా సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. వైకాపాది పోయే ప్రభుత్వమని.. వారిని నమ్ముకుని వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని, ఒత్తిడి తెస్తే ఎదురు తిరగాలని పేర్కొన్నారు. ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్రగౌడ్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు సామాన్య తెదేపా కార్యకర్తలని, వారిద్దరినీ గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నాగరాజు ప్రస్తుతం ఎంపీటీసీగా పనిచేస్తున్నారని, ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చామని గుర్తుచేశారు.
ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా?
ఈనాడు డిజిటల్, అనంతపురం: అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అవసరం కోసం మొసలి కన్నీరు కార్చడం సీఎం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని చంద్రబాబు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? పవన్ కల్యాణ్ను ఇష్టానుసారంగా తిడుతున్నారు. నా మీద నోరు పారేసుకుంటున్నారు. బూతులు తిట్టాలంటే ఒక్క నిమిషం పని. కానీ అభివృద్ధి చేయడం కష్టం.. కూల్చడం ఎంతసేపు? అకారణంగా ప్రజావేదికను కూల్చేశారు. జగన్ విధ్వంసం తప్ప ఏమీ చేయలేదు. అమరావతిని నాశనం చేశారు’ అని విమర్శించారు. ‘మందుబాబుల బలహీనతే జగన్ బలం. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ. 200 పలుకుతోంది. అయిదేళ్లలో రూ. లక్షల కోట్లు దోచుకున్నారు.పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. ధరలు పెంచి, పన్నులు వేసి, మీ డబ్బులు కొట్టేసి, మీ రక్తాన్ని తాగేసిన జలగ ఈ జగన్మోహన్రెడ్డి’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ వైకాపా వస్తే మీ భూములు వదులు కోవాల్సిందే: చంద్రబాబు
నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
జగన్.. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడవని అధికారం ఎందుకు?: పవన్
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని జగన్కు అధికారం ఎందుకని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. -
గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ వాయిదా
గాజు గ్లాసు గుర్తును ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ తెదేపా దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. -
ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా?: చంద్రబాబు
జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయి -
వైకాపా రంగుల పిచ్చితో రూ.2300 కోట్లు దుబారా: పవన్ కల్యాణ్
రంగుల పిచ్చిలో వైకాపా ప్రభుత్వం రూ.2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. -
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్మీనా తెలిపారు. -
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి తెదేపా విజ్ఞప్తి
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది. -
నదుల అనుసంధానానికి భాజపా కట్టుబడి ఉంది: నితిన్ గడ్కరీ
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో కూటమి అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. -
ఐదేళ్లలో జగన్ అవినీతి రూ.8 లక్షల కోట్లు: తెదేపా నేత పట్టాభిరామ్
ఐదేళ్లలో వైఎస్ జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
సీఎం జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘నవ సందేహాల’ పేరుతో జగన్కు షర్మిల మరో లేఖ
‘నవ సందేహాల’ పేరుతో సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. -
వైకాపా ప్రచారంలో ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టరు ఇంజిన్
దెందులూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి ప్రచార ర్యాలీ తీశారు. -
చంద్రబాబు రోడ్షోలో వైకాపా కవ్వింపు చర్యలు
తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన రోడ్షోలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. -
ప్రచారం పేరుతో.. కొడాలి నాని డబ్బుల పంపిణీ!
ఎన్నికల ప్రచారం పేరుతో గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామాల్లో రూ.లక్షల్లో నగదు పంచుతున్నా నియమావళి అమలు కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్ల పంపిణీలో మాజీ వాలంటీర్లు.. వైకాపాకు అనుకూలంగా ఓట్ల అభ్యర్థన!
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లిలో బుధవారం మాజీ వాలంటీర్లు పింఛన్ల సొమ్మును పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. -
నీటి సమస్య మాటేంటి?.. వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డిని నిలదీసిన గ్రామస్థులు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం అగసలదిన్నెలో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. -
పెద్దిరెడ్డి ప్రమేయంతో వైకాపా గూండాల దాడి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షగట్టి తన ఇంటిపై దాడికి వైకాపా గూండాలను పురికొల్పారని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన పూర్వ జడ్జి ఎస్.రామకృష్ణ ఆరోపించారు. -
7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ
ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
తొడకొట్టి.. జోగి తనయుడి వీరంగం
మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడి రాజకీయాలు ప్రశాంతతకు నిలయమైన కృష్ణా జిల్లా పెనమలూరును దౌర్జన్యాలు, దాడులకు కేంద్రంగా మారుస్తున్నారు. -
ఆ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించం
రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు ఏయే లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయో ఆయా లోక్సభ స్థానాలకు పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులకుగానీ, స్వతంత్ర అభ్యర్థులకుగానీ ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించదు. -
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చా: అంబటి రాయుడు
వైకాపాలో బానిసత్వం సహించలేక జనసేనలోకి వచ్చినట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చెప్పారు. కృష్ణా జిల్లాలో జనసేన మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులు.. వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ల తరఫున ఎన్నికల ప్రచారం కోసం రాయుడు బుధవారం అవనిగడ్డ వచ్చారు.
తాజా వార్తలు
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!