అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు.
అభ్యర్థులంతా మంచివారని జగన్ కితాబు
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి ఎన్నికల బాధ్యతలా!
ప్రకృతి వనరులను దోచేస్తున్నది ఎవరని ప్రశ్నిస్తున్న ప్రజలు
ఈనాడు, అమరావతి: కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. వారిని పేరుపేరునా మేమంతా సిద్ధం సభలో పరిచయం చేశారు. మరి ఈ అయిదేళ్లలో ఆ నియోజకవర్గాల్లో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అరాచకాలకు బాధ్యులెవరో కనుక్కోవాలని స్థానికులే అడుగుతున్నారు. చెప్పగలరా జగన్?
సౌమ్యుడు-1 ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
‘కాకినాడ సిటీ నుంచి పోటీచేస్తున్న చంద్ర (ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి) మంచివాడు.. సౌమ్యుడు. పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు’ అంటూ సీఎం జగన్ ఆకాశానికెత్తేశారు. మరి కాకినాడ సిటీలో అయిదేళ్లుగా అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేదు. రేషన్ మాఫియాకు కాకినాడే కేంద్రస్థానంగా పేరుపడింది. ఆ మాఫియా నేత ఎవరో కాస్త అడిగి చెబుతారా? భూముల కబ్జాలకు అంతే లేదు. పెద్దాపురం, జగ్గంపేట, అనపర్తి ప్రాంతాల్లో మట్టిని మింగేసిన ఘనులూ ఉన్నారు. విశాఖ మన్యం నుంచి గంజాయి తెచ్చే ముఠాకు నాయకుడెవరో కూడా ఆరా తీస్తారా? గతంలో ప్రతిపక్షాలకు చెందిన అగ్రనేతలను మహిళా ప్రతినిధుల ఎదుటే అసభ్య పదజాలంతో దూషించారన్న సంగతైనా మీ అభ్యర్థికి తెలుసేమో అడిగారా? కాస్త కనుక్కుని ప్రజలకు వివరించి చెప్పొచ్చుగా?
సౌమ్యుడు-2: దాడిశెట్టి రాజా
‘తుని నుంచి పోటీచేస్తున్న రాజా మంచివాడు, నాకు స్నేహితుడు. సౌమ్యుడంటూ జగన్ ప్రశంసల్లో ముంచెత్తారు. మూడుముక్కలాటలు, గానాబజానాల్లో మునిగితేలే నేతలెవరో ఆయనకు బాగా తెలుసని నియోజకవర్గంలోని వారంతా అంటున్నారు. అయిదేళ్లుగా నియోజకవర్గంలో అరాచకాలకు అంతే లేదు. లాటరీ టికెట్లు, గుట్కా వ్యాపారం చేయిస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. మట్టి, ఇసుకను కొల్లగొడుతున్నారు. వాళ్లంతా ఎవరో మీ స్నేహితుడికి తెలుసా? దళితుల సాగుభూముల్నీ వదలకుండా కబ్జా చేసిన ఘనులెవరోకూడా మీ స్నేహితుడ్ని అడిగి చెప్పండి.
సౌమ్యుడు-3: కురసాల కన్నబాబు
మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందే ఉంటారంటూ... కాకినాడ రూరల్ నుంచి పోటీచేస్తున్న కన్నబాబును జగన్ వెనకేసుకొచ్చారు. ఆయన ఎంతో సౌమ్యుడని కొనియాడారు. అంతులేని అక్రమాలెన్నింటికో ఆయన ప్రాతినిధ్యం వహించే కాకినాడ గ్రామీణ నియోజకవర్గం కేంద్రమైంది. ఇంటిపట్టా ఇవ్వాలంటే రూ.60వేల నుంచి రూ.1.50లక్షలు కట్టాలని పేదలను వేధించారు. రియల్ఎస్టేట్ వెంచర్లు వేసుకోవాలన్నా.. కాంట్రాక్టు పనులు చేయాలన్నా రూ.లక్షల్లో వసూలుచేశారు. వివాదాస్పద భూములు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని బెదిరించి వాటిని కబ్జా చేశారు. సౌమ్యుడంటూ మీరు కితాబిచ్చిన కన్నబాబుకు ఇవన్నీ తెలుసో లేదో, ఎవరు చేశారో ఆయన్ని అడిగి చెబుతారా? భూ వివాదాల కారణంగా ఇటీవల ఒక వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇన్ని దారుణాలు జరుగుతుంటే మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుండే కన్నబాబు చూస్తూ ఊరుకుంటున్నారా? ఎందుకో మరి?
సౌమ్యుడు, మంచి స్నేహితుడు: చలమలశెట్టి సునీల్
‘కాకినాడ నుంచి లోక్సభకు పోటీచేస్తున్న సునీల్ మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు’ అని జగన్ పరిచయం చేశారు. ఇద్దరి మధ్య అంత బంధానికి కారణాలేంటో కూడా కాస్త వివరంగా చెప్పి ఓట్లడిగితే.. ప్రజలంతా తెలుసుకునేవారు కదా? ఆయనకు చెందిన ఇంటిగ్రేటెడ్ విద్యుత్ ప్రాజెక్టుకు కర్నూలు జిల్లాలో 7,466 ఎకరాలను కేటాయించారు. ఎన్నికల కోడ్ వచ్చే కొద్దిరోజుల ముందు 1,985 ఎకరాలు గంపగుత్తగా అమ్మేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవన్నీ మీ ప్రభుత్వంలోనే కదా? పరిచయం చేసేటప్పుడే ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సింది.
మంచివాడు-2: వరుపుల సుబ్బారావు
‘ప్రత్తిపాడు నుంచి బరిలో ఉన్న సుబ్బారావు. పొట్టివాడైనా.. గట్టివాడు. మనసున్నవాడు’ అని సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. దళిత డ్రైవర్ను హత్యచేసి డోర్ డెలివరీ చేశారనే కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఈయనకు బంధువేనట కదా? సుబ్బారావు గెలుపు బాధ్యతలు ఆయనకే అప్పగించారంటున్నారు.. నిజమేనా? ఆ సంగతులేంటో ఓటర్లకు వివరించి చెప్పి ఉండాల్సింది. అక్రమ మైనింగ్తో రూ.కోట్లు కొట్టేస్తున్నదెవరో ఈ మనసున్న మనిషికి తెలుసేమో ఆరా తీయండి.
మంచివాడు-1: దవులూరి దొరబాబు
‘పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీలో ఉన్న దొరబాబు యువకుడు, ఉత్సాహవంతుడు. మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తున్నారు’ అని జగన్ కితాబిచ్చారు. అధికారపార్టీ అండగా అరాచకాలు చేస్తున్న నాయకులెవరో.. ఈ ఉత్సాహవంతుడికి ఏమైనా తెలుసేమో అడిగారా? అక్కడ జరిగే సెటిల్మెంట్ల వెనక ఎవరున్నారో, రామేశ్వరం మెట్టలో 826 ఎకరాల్లో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేసిందెవరో కనుక్కోండి జగన్! స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకుండానే.. అధికారం చెలాయించే నాయకులూ ఈ నియోజకవర్గంలో ఉన్నారంట. వారెవరో కాస్త తెలుసుకుని ఓటర్లకు చెప్పండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట