దళితులంటే జగన్కు చులకన
సీఎం జగన్కు దళితులంటే చులకన అని.. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్రావులను సైతం చిన్నచూపు చూశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
వైకాపాలో దళిత నేతలపైనా పెత్తందారీతనమే
ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్లపై పెద్దిరెడ్డి పెత్తనం
అందుకే వాళ్లిద్దరూ జగన్రెడ్డికి ఎదురెళ్లారు
రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు.. క్యాష్ వార్ నడుస్తోంది
పొదలకూరు, సత్యవేడు సభల్లో చంద్రబాబు ధ్వజం
ఈనాడు- నెల్లూరు, ఈనాడు డిజిటల్-తిరుపతి, న్యూస్టుడే- సత్యవేడు: సీఎం జగన్కు దళితులంటే చులకన అని.. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్రావులను సైతం చిన్నచూపు చూశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపాలోని దళిత ప్రజాప్రతినిధులపైనా పెత్తందారీతనమే రాజ్యమేలిందని మండిపడ్డారు. జగన్ అయిదేళ్ల పాలనలో దళితులపై ఆరు వేల కేసులు నమోదయ్యాయి.. 180 మంది చనిపోయారని గుర్తుచేశారు. ఈ ముఖ్యమంత్రి.. దళితుణ్ని చంపి డోర్ డెలివరీ చేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని, శిరోముండనం కేసులో నేరస్థుడైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెటిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో ఉండే పెద్దారెడ్డికి సత్యవేడులో ఏం పని అంటూ ప్రశ్నిస్తూ ఆదిమూలం.. జగన్రెడ్డికే ఎదురెళ్లారన్నారు. ఎంపీ వరప్రసాదరావును విద్యావంతుడని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. పుంగనూరు పెద్దతలకాయ పెద్దిరెడ్డి సత్యవేడులో పెత్తనం చేస్తూ ఇక్కడి ఇసుక, గ్రావెల్ అక్రమంగా దోచుకున్నారని గుర్తుచేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు, తిరుపతి జిల్లా సత్యవేడుల్లో శనివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో చంద్రబాబు వైకాపా ప్రభుత్వం, జగన్ దోపిడీ, దౌర్జన్యాలపై ధ్వజమెత్తారు. జగన్ దుర్మార్గాలను ఎదిరించిన ఆదిమూలం, వరప్రసాదరావులను, సర్వేపల్లిలో తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపా
‘నా పాలనలో ఉపప్రణాళిక, విదేశీవిద్య అమలు చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపా. నేడు విదేశీవిద్య పథకం పేరు మార్చి, అర్హులకు లబ్ధి చేకూరకుండా చేశారు. బ్యాక్లాగ్ పోస్టులు, అంబేడ్కర్ స్టడీ సెంటర్లు నామరూపాల్లేకుండా చేశారు’ అని ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ నాంది పలికితే.. నేను దానికి అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాను. పింఛను, రూ.2కే కిలో బియ్యం తెచ్చింది ఎన్టీఆర్. రూ.200 నుంచి పది రెట్లు పింఛను పెంచింది నేను. అలాంటి మాతో మీకు పోటీయా? సంక్షేమానికి మీరెంత ఖర్చు పెట్టారు జగన్రెడ్డీ?’ అని నిలదీశారు. తెదేపా హయాంలో పేదలకు పండగ కానుకలు ఇచ్చాం. అయిదేళ్లుగా వస్తున్నాయా అని ప్రశ్నించారు. ‘సన్నబియ్యం పేరుతో జగన్రెడ్డి ప్రజలను మోసం చేశారు. నాసిరకం మద్యంతో మహిళల పుస్తెలు తెంచారు. ఇసుకను కొల్లగొట్టారు. ఒకప్పుడు రూ.వెయ్యికి దొరికే ట్రాక్టర్ ఇసుక ప్రస్తుతం రూ.5 వేలు.. మిగిలిన రూ.4 వేలు జగన్రెడ్డి జేబులోకి వెళుతున్నాయి.రాష్ట్రంలో జరుగుతోంది క్లాస్వార్ కాదు.. క్యాష్ వార్’ అని ధ్వజమెత్తారు. ‘కూటమి ప్రభుత్వం రాగానే రూ.1.50 పైసలకే యూనిట్ విద్యుత్తు సరఫరా చేసి, ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతాం. జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలు మీకిచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది, ఇక మీ ఆటలు సాగవని జగన్ను ఉద్దేశించి అన్నారు. గత అయిదేళ్లలో ప్రజల సంపద తగ్గి జగన్ ఆస్తులు, భారతి సిమెంట్, సాక్షి పత్రికల ఆదాయాలు మాత్రమే పెరిగాయని విమర్శించారు.
ఈసారి జగన్ చెవిలో పూలు పెడదాం
‘గొడ్డలి, కోడికత్తి, గులకరాయి అంటూ జగన్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. ఆయన్ను చంపేందుకు గులకరాయి వేసి నేను హత్యాయత్నం చేయించానట! ఎన్నికలు రాగానే ప్రజల చెవుల్లో పూలు పెడదామనుకుంటున్నార[ు. ఈసారి అందరం కలసి జగన్రెడ్డి చెవిలో పూలు పెడదాం. కృష్ణపట్నం పోర్టు కింద భూములు కోల్పోయినవారికి రూ.15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయిస్తే.. ఈ ప్రభుత్వం నిలిపివేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తాం. నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం’ అని హామీ ఇచ్చారు. ‘జగన్రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జలరెడ్డిలకు నెల్లూరులో కాకాణి తోడయ్యారు. ఉదయగిరి నారాయణ అనే దళితుణ్ని చంపేస్తే చర్యల్లేవు. ఇళ్ల పట్టాలకు 3 వేల ఎకరాలు కొని 6 వేల ఎకరాలుగా చూపించి డబ్బు కొట్టేశారు. కరోనాలో పెద్ద ప్యాలెస్ కట్టారు. వైకాపా అక్రమాలపై పోరాడితే సోమిరెడ్డిపై 22 కేసులు పెట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దుర్మార్గుడైన జగన్మోహన్రెడ్డి నాపైనా 22 కేసులు పెట్టించారు. భవిష్యత్తులో నేనేంటో చూపిస్తా. చక్రవడ్డీతో తీర్చేస్తా’ అని చంద్రబాబు హెచ్చరించారు.
చంద్రబాబును కలిసిన మంతెన రామరాజు
గూడూరు పట్టణం, న్యూస్టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు వచ్చిన చంద్రబాబును ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు శనివారం కలిశారు. ఉండిలో కూటమి తరఫున తెదేపా అభ్యర్థిగా రామరాజును ప్రకటించారు. అయితే ఇక్కడ అభ్యర్థిని మారుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రామరాజు గూడూరుకు వచ్చి చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు