అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు
లోక్సభ, శాసనసభ స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మూడో రోజు వివిధ పార్టీల నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్లు సమర్పించారు.
లోక్సభ, శాసనసభ స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మూడో రోజు వివిధ పార్టీల నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్లు సమర్పించారు. తమతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు, ఆదాయ వనరులు, విద్యార్హతలు, పోలీసు కేసులకు సంబంధించిన వివరాలు అందజేశారు.
చెవిరెడ్డిపై 11 క్రిమినల్ కేసులు
సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు, వైకాపా ఒంగోలు లోక్సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సమర్పించిన అఫిడవిట్లో తనకు సొంత కారు లేదని పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీయూలో ఎంఏ, న్యాయశాస్త్రాల్లో పట్టా పొందిన చెవిరెడ్డి.. ‘దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల’పై పరిశోధన చేసి, డాక్టరేట్ పొందారు. చెవిరెడ్డిపై 11 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో మాజీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ను అడ్డగించడం, శ్మశాన భూముల ఆక్రమణ, దాడులు, దౌర్జన్యాలు, అధికారుల విధులను అడ్డుకోవడం, ధర్నాలు, నిరసనలపై నమోదైన కేసులు ప్రధానమైనవి. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 2 కేసులు నమోదయ్యాయి. భాస్కర్రెడ్డి భార్య లక్ష్మీకాంతమ్మ పేరిట ఫార్చ్యునర్ (రూ.19 లక్షలు) కారు, 960 గ్రాముల బంగారం (రూ.58.50 లక్షలు) ఉన్నాయి. చెవిరెడ్డి పేరిట రూ.1.18 కోట్ల చరాస్తులు, రూ.2.20 కోట్ల స్థిరాస్తులు, రూ.66 లక్షల నగదు ఉన్నాయి. అప్పులు రూ.6.53 కోట్లు. భార్య లక్ష్మీకాంతమ్మ పేరిట స్థిరాస్తి రూ.6.57 కోట్లు. చరాస్తి రూ.6.60 కోట్లు. అప్పు రూ.6.53 కోట్లు. ఆమె చేతిలో రూ.13 లక్షల నగదు ఉంది.
వీరాంజనేయులు చరాస్తులు రూ.98 వేలట
శింగనమల వైకాపా అభ్యర్థి ఎం.వీరాంజనేయులు తన చరాస్తులు రూ.98 వేలుగా పేర్కొన్నారు. ఆయనపై ఎలాంటి కేసులూ లేవు.
రజిని కుటుంబ ఆస్తులు తరిగాయట!
రాష్ట్ర మంత్రి, గుంటూరు పశ్చిమ వైకాపా అభ్యర్థి విడదల రజిని కుటుంబ ఆస్తులు ఐదేళ్లలో తగ్గినట్లు చూపించారు. 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆమె ఆస్తులతో పాటు కుటుంబ సభ్యులవి కలిపి మొత్తం విలువ రూ.129.62 కోట్లు. ప్రస్తుత విలువ రూ.85.76 కోట్లు. ఐదేళ్లలో రూ.43.86 కోట్లు తగ్గాయి. అయితే మంత్రి రజిని వ్యక్తిగత ఆస్తులు బాగా పెరిగాయి. 2019లో రూ.3.70 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.18.80 కోట్లు. ఐదేళ్లలో కొత్తగా సాగు భూములు, స్థలాలు సమకూరాయి. కొన్ని వారసత్వంగా రాగా, కొన్ని కొన్నారు. ఆమె భర్త కుమారస్వామి ఆస్తులు ఐదేళ్లలో తగ్గాయి. 2019లో రూ.124.20 కోట్లు అయితే, నేడు రూ.66.62 కోట్లు. ఆయనకు 2019లో రూ.120 కోట్ల విలువైన ఐటీ కంపెనీ ఉండగా, ప్రస్తుతం రూ.22 కోట్లు, రూ.5 కోట్ల విలువైన రెండు కంపెనీలున్నాయి.
వాసుపల్లి ఆస్తులు.. నాలుగింతలు
విశాఖ దక్షిణ వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేశ్కుమార్, ఆయన భార్య ఉషారాణి దంపతుల ఉమ్మడి ఆస్తులు ఐదేళ్లలో 4 రెట్లు పెరిగాయి. 2019లో స్థిరాస్తి రూ.7.72 కోట్లు కాగా, ఇప్పుడు రూ.37.9 కోట్లు. 2019లో చరాస్తులు రూ.1.35 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.22.4 లక్షలు. ఇద్దరికీ రెండు ఫార్చ్యునర్లు సహా 6 కార్లు, రూ.23.45 కోట్ల అప్పులున్నాయి. వాసుపల్లిపై 4 కేసులున్నాయి. 2008లో ఆస్తి వివాదంలో ఒకరిపై దాడి చేయగా, గణేశ్పై కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు 6 నెలల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.
కోలగట్ల దంపతులకు కార్లే లేవట!
విజయనగరం అసెంబ్లీ స్థానం వైకాపా అభ్యర్థి, శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ ఆస్తులు రూ.29.39 కోట్లు. వీరభద్రస్వామి పేరిట చరాస్తులు రూ.6.48 కోట్లు, స్థిరాస్తులు రూ.15.34 కోట్లు. అతని భార్య పేరిట చరాస్తులు రూ.2.97 కోట్లు, స్థిరాస్తులు రూ.4.60 కోట్లు. ఇద్దరికీ వాహనాలు లేవు. ఆయన వద్ద రూ.1.56 లక్షల నగదు, రూ.67 లక్షల విలువైన కిలో బంగారం, భార్య వద్ద రూ.1.11 లక్షల నగదు, రూ.1.13 కోట్ల విలువైన 2 కిలోల బంగారం, 4 కిలోల వెండి ఉన్నాయి. కోలగట్ల పేరిట రూ.3.30 కోట్ల డిపాజిట్లు, భార్య పేరిట రూ.3.70 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. కోలగట్ల దంపతులు వేర్వేరుగా ఇతరులకు రూ.4.05 కోట్ల అప్పులివ్వగా, ఆయనకు వ్యక్తిగతంగా రూ.7.49 కోట్ల అప్పు ఉంది. కోలగట్లపై 2 క్రిమినల్ కేసులున్నాయి.
వంశీ సంపద భారీగా పెరుగుదల
కృష్ణా జిల్లా గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ ఆస్తులు పదేళ్లలో భారీగా పెరిగాయి. 2014లో స్థిర, చరాస్తుల మొత్తం రూ.72.50 కోట్లు కాగా, 2019లో రూ.69.08 కోట్లు. ప్రస్తుతం రూ.172.36 కోట్లు. వంశీ భార్య పంకజశ్రీ ఆస్తులు 2014లో రూ.9.55 కోట్లు కాగా, 2019లో రూ.9.08 కోట్లు. ఇప్పుడు రూ.18.99 కోట్లు. తరచూ కార్లు మారుస్తూ, కాన్వాయ్తో తిరిగే వంశీ పేరిట రూ.74.69 లక్షల విలువైన ఆడి కారు, రూ.46.51 లక్షల విలువ చేసే బెంజ్ కారు ఉన్నాయి. వంశీ పేరిట 1.6 కిలోలు, భార్య పేరిట 1.3 కిలోల బంగారముంది. 2019 ఎన్నికల సందర్భంగా జరిగిన వివాదంలో వంశీపై 3 కేసులు నమోదయ్యాయి.
అన్న, వదిన దగ్గర షర్మిల అప్పులు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరిట రూ.132 కోట్ల ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తులు రూ.123.26 కోట్లు, స్థిరాస్తులు రూ.9.29 కోట్లు. భర్త బ్రదర్ అనిల్కుమార్ పేరిట చరాస్తులు రూ.45.19 కోట్లు. స్థిరాస్తులు రూ.4.05 కోట్లు. సోదరుడు సీఎం జగన్ దగ్గర రూ.82.58 కోట్లు, వదిన భారతి నుంచి రూ.19.56 లక్షల రుణం తీసుకున్నారు. అనిల్కుమార్.. రతన్ అనే వ్యక్తి నుంచి రూ.50 లక్షలు, వైఎస్ విజయమ్మ నుంచి రూ.40 లక్షలు, షర్మిల నుంచి రూ.29.99 కోట్ల అప్పు తీసుకున్నారు. షర్మిల పేరిట రూ.4.61 కోట్ల విలువైన బంగారం, 39.41 ఎకరాల భూమి ఉంది. కడప, తాడేపల్లి, బంజారాహిల్స్, గాంధీనగర్ ఠాణాల్లో మొత్తం 8 కేసులున్నాయి.
పురందేశ్వరి కుటుంబ ఆస్తులు రూ.61.46 కోట్లు
రాజమహేంద్రవరం లోక్సభ భాజపా అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.61.46 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.11.75 కోట్లు. స్థిరాస్తులు రూ.49.70 కోట్లు. అప్పులు రూ.6.73 కోట్లు. 1.6 కిలోల బంగారం, 74 క్యారెట్ల వజ్రాలు, 10 గ్రాముల ముత్యాలు ఉండగా, వీటి విలువ రూ.1.19 కోట్లు. పురందేశ్వరి పేరిట వ్యవసాయ భూమి, వాహనం లేవు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఇంటి విలువ రూ.5.55 కోట్లు. ఆమెపై కేసులు లేవు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!