మాచర్ల మార్పు కోరుకుంటోంది!
ఒక చేత్తో ఇస్తున్నారు... మరో చేత్తో లాక్కుంటున్నారు. ఈ విషయం మొదట్లో అర్థం కాలేదు గానీ ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది.
అయిదేళ్లలో దాడులు.. దౌర్జన్యాలు.. హత్యలే
ఇప్పటికీ 50 పడకల సర్కారు ఆస్పత్రే దిక్కు
పల్నాడు ఎన్నికల యుద్ధం ఆసక్తికరం
ఒక చేత్తో ఇస్తున్నారు... మరో చేత్తో లాక్కుంటున్నారు. ఈ విషయం మొదట్లో అర్థం కాలేదు గానీ ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. కరెంట్ బిల్లులు, బస్సు ఛార్జీలు పెంచేశారు.
మాచర్లలోని ఓ కళాశాల స్వీపర్
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగుసార్లు గెలిచారు. మార్పు ఉంటే మంచిదన్న టాక్ వినపడుతోంది. పరిశ్రమలు పెడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాంటివి ఇక్కడ లేవు.
మాచర్లలో ముస్లిం వర్గానికి చెందిన ఓ దర్జీ
చిన్న చిన్నవాటికి పోలీసు కేసులు పెట్టించడం ఎక్కువైంది. అందుకే నేను వైౖకాపా అభిమానినైనా ఈసారి బ్రహ్మానందరెడ్డి విజయానికి పనిచేస్తున్నా.
మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలేనికి చెందిన ఓ వ్యవసాయ కూలీ
ఈనాడు, అమరావతి: ‘ఒకప్పుడు ఎన్నికలొస్తే బాంబుదాడులు... హత్యలు జరిగేవని పెద్దవాళ్లు చెబుతుండేవారు. ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితి రాబోతోందట.’ మాచర్లలో ఈసారి ఎవరిది గెలుపు అని అడిగినప్పుడు 30 ఏళ్ల యువకుడి సమాధానమిది. పల్నాడు జిల్లాలో చివరి నియోజకవర్గమైన మాచర్లలో ఈ అయిదేళ్లలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించకపోగా... కక్షలు, కార్పణ్యాలను వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెంచి పోషించారన్న అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది. వైకాపా ఇక్కడ హత్యా రాజకీయాలకు మళ్లీ తెరలేపిందన్న ప్రచారం సాగుతోంది. మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి నాలుగోసారి గెలవడం, వైకాపా అధికారంలోకి రావడం, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి నియమితులు కావడంతో ఇక్కడ తమ ఆధిపత్యం కోసం వైకాపా నేతలు రాజకీయ కక్షల్ని ఎగదోశారు. మళ్లీ ఫ్యాక్షనిజం పడగ విప్పింది. మే 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మరోసారి పిన్నెల్లి బరిలో నిలవగా.. తెదేపా నుంచి 15 సంవత్సరాల తర్వాత జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాత ప్రత్యర్థితో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి మాచర్ల పట్టణంతోపాటు దుర్గి, వెల్దుర్తి, రెంటచింతల మండలాల్లో పర్యటించారు. ఎక్కువమంది నుంచి నాలుగుసార్లు గెలిచారు కదా... ఇక మార్పు ఉండాలనే మాటే వస్తోంది. 2002 నుంచి వైకాపా శ్రేణులు చేసిన దారుణాలను ఓటర్లు గుర్తు చేసుకుంటున్నారు. తెదేపా తమ్ముళ్లలో జోష్ కనిపిస్తోంది. ఈసారి పిన్నెల్లిని ఇంటికి పంపిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో స్వల్ప మెజారిటీతోనైనా తమ పార్టీ గెలుస్తుందని వైకాపా శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి.
హత్యలు రెండు.. అరాచకాలు కోకొల్లలు
గత అయిదేళ్లుగా వైకాపా నేతలు చేయని అరాచకాలు లేవు. బెదిరించి, నకిలీ పత్రాలు సృష్టించి వందల ఎకరాల ప్రైవేటు భూములను సొంతం చేసుకున్నారు. దీని వెనుక ఎమ్మెల్యే, ఆయన తమ్ముడి ప్రోద్బలం ఉందని తెదేపా ఆరోపిస్తోంది. ఇక మట్టి తరలింపు, మద్యం అమ్మకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెదేపా నేతల్ని, కార్యకర్తలను వైకాపా వర్గాలు పట్టపగలు హత్యలు చేశాయి. 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్యను వైకాపా మండల నేత, ఆయన వర్గీయులు పట్టపగలు నడిరోడ్డుపై పీక కోసి చంపేశారు. ఆరు నెలలు తిరక్కుండానే ఆ ఏడాది జూన్లో దుర్గి మండలం జంగమేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను హత్య చేశారు. దీంతో వెల్దుర్తి మండలం గుండ్లపాడు, దుర్గి మండలం ఆత్మకూరు గ్రామాల్లో కుటుంబాలకు కుటుంబాలే భయంతో ఊళ్లు వదిలిపోయాయి. ‘తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లలో కొడవలి ఉన్నా మారణాయుధాలని పోలీసులతో అక్రమ కేసులు పెట్టించారు. ఎవరైనా నోరు ఎత్తితే గంజాయి దొరికిందని కేసు పెడతారో, తెల్లారేసరికి ఎవరి పొలం ప్రభుత్వ భూమిగా మారుతుందో అని భయం. ఇంత అరాచకం ఎక్కడైనా ఉందా?’ అని వెల్దుర్తి మండలానికి చెందిన నేత ఒకరు చెప్పారు.
నాలుగు సార్లు గెలిచారుగా
పిన్నెల్లి ఇప్పటివరకు నాలుగుసార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2012 ఉప ఎన్నికలు, 2014, 2019లో వైకాపా నుంచి గెలిచారు. 20 ఏళ్లుగా ఇక్కడ పసుపుజెండా ఎగరలేదు. 2004, 2009లో ఇక్కడ గెలిచిన జూలకంటి బ్రహ్మానందరెడ్డిని తెదేపా మళ్లీ బరిలోకి దించింది. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ తెదేపా కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. మళ్లీ పిన్నెల్లి గెలిస్తే నియోజకవర్గం ప్రశాంతంగా ఉండదని, తెల్లారితే ఎవరి హత్యవార్త వినాల్సి వస్తుందోనన్న భయం సామాన్య ప్రజానీకాన్ని వెంటాడుతోంది. అందుకే ఈసారి మార్పు రావాలన్న అభిప్రాయం మాచర్ల పట్టణంలో ఎక్కువగా వినిపిస్తోంది. ‘దౌర్జన్యాలు మరీ విచ్చలవిడి అయ్యాయి. అందుకే మార్పు కోరుకుంటున్నారు’ అని విశ్రాంత ఉద్యోగి చెప్పారు. ఈసారి గెలిచి మంత్రినవుతానని ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే, ‘ఎమ్మెల్యేగా ఉంటేనే ఆగడాలు భరించలేకపోతున్నాం. ఇక మంత్రి అయితే ఏమైనా ఉందా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ‘పిన్నెల్లి అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కాకపోతే జగన్ను చూసి ఓట్లు వేయాల్సిందే. పోయినసారి 22వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి 100 ఓట్లతోనైనా గెలుస్తారని నమ్మకంతో ఉన్నాం’ అని వెల్దుర్తి మండలం ఉప్పలపాడుకు చెందిన ఓ రైతు ఒకరు వ్యాఖ్యానించారు. ఆయన వైకాపా కార్యకర్త. జూలకంటిపై ప్రజల్లో కొంత సానుభూతి వ్యక్తమవుతోంది.
తాగునీటికీ నరకమే!
2009 నుంచి పిన్నెల్లి వరుసగా గెలుస్తున్నా అభివృద్ధి మచ్చుకైనా లేదు. రోగమొచ్చినా.. పిల్లల ఉన్నత చదువులకైనా నరసరావుపేట లేదా గుంటూరు వెళ్లాలి. వెల్దుర్తి, దుర్గి మండలాలకు సాగునీరే కాదు.. తాగునీటికీ నరకమే. ఎన్నికలొస్తున్నాయని, గత నవంబరులోనే సీఎం జగన్ హడావుడిగా వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. లక్ష జనాభా ఉన్న మాచర్లలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రే ఉంది. దాన్ని 100 పడకల స్థాయికి పెంచుతామని ఎన్నికల ముందు వైకాపా హామీ ఇచ్చింది. ఎమ్మెల్యే ఈ అయిదేళ్లు పట్టించుకోకుండా నవంబరులో సీఎం జగన్ వచ్చినప్పుడు చెప్పగా, ఆయన ఓ హామీ ఇచ్చేశారు. ప్రస్తుతం అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు 90 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేటకు లేదా 130 కిలోమీటర్ల దూరమున్న గుంటూరుకు వెళ్లాల్సిందే. దుర్గి మండలంలోని బుగ్గవాగు నుంచి పైపులైన్ ద్వారా మాచర్లకు రూ.81.37 కోట్ల అంచనాతో తాగునీటిని అందిస్తామని 2023 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. నియోజకవర్గం ఏర్పడిన 1955 నుంచి ఏ ఒక్కరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. ఆ అరుదైన అవకాశం పిన్నెల్లికి వచ్చినా ప్రయోజనం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాచర్ల నుంచి నాగార్జునసాగర్ రోడ్డు, గుంటూరు జిల్లా నడికుడి నుంచి మాచర్ల మీదుగా యర్రగొండపాలెం, దోర్నాల, శ్రీశైలం వరకు జాతీయ రహదారులను కేంద్రప్రభుత్వం నిర్మించింది. అవితప్ప గత 20 ఏళ్లుగా మాచర్లలో ఇదీ మార్పు అని చెప్పలేని దుస్థితి ఉందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.