icon icon icon
icon icon icon

నామినేషన్‌కు వచ్చినందుకు నగదు పంచిపెట్టిన వైకాపా నాయకులు

వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబు నామినేషన్‌ వేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో నగదు పంపిణీ విస్తృతంగా జరిగింది.

Updated : 23 Apr 2024 08:49 IST

మార్కాపురం, న్యూస్‌టుడే: వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబు నామినేషన్‌ వేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో నగదు పంపిణీ విస్తృతంగా జరిగింది. ర్యాలీలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి రూ.300 నుండి రూ.500 వరకు వైకాపా నాయకులు పంపిణీ చేశారు. 7వ వార్డు కౌన్సిలర్‌ కొత్త కృష్ణతో పాటు మరికొంతమంది నగదు పంచుతూ మీడియాకు చిక్కారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి మహిళా కూలీలను నాయకులు కార్యక్రమానికి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img